గేరు మార్చిన జగన్ - ఇక పోరుబాట, షెడ్యూల్ ప్రకటన..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావటంతో ఇక తమ పాత్ర పోషించేందుకు సిద్దమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తరువాత కూటమి ప్రభుత్వం పైన మీడియా సమావేశాల ద్వారా టార్గెట్ చేస్తున్న జగన్..ఇక, పార్టీ నిరసనలకు నిర్ణయించారు. రైతు, విద్యార్థుల సమస్యల పైన పోరుబాటకు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు నిరసనల కార్యాచరణ షెడ్యూల్ ప్రకటించారు. జనవరి రెండో వారం తరువాత జిల్లాల వారీగా పర్యటనల ప్రారంభిస్తానని జగన్ మరోసారి స్పష్టం చేసారు.
వైసీపీ పోరుబాట
మాజీ సీఎం జగన్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. ఆరు నెలల సమయం వేచి చూసినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. ప్రజల తరపున పోరాటాలు చేయాల్సిన సమయం వచ్చిందని వివరించారు. అందులో భాగంగా ముందు గా రైతులు, విద్యార్ధుల సమస్యల పైన నిరసనలకు నిర్ణయించారు. రైతులకు రూ 20 వేల పెట్టుబడి సాయం తో పాటుగా ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల భీమా పునరుద్దరణ డిమాండ్ తో ఈ నెల 11న వైసీపీ నేతలు ర్యాలీలు చేయనున్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రభుత్వ వైఫల్యాలపై
ఇక, ఈ నెల 27వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన కరెంట్ ఛార్జీల పైన అన్ని జిల్లాల్లోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయాలు..సీఎండీ కార్యాలయాలకు స్థానిక ప్రజలతో వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కరెంట్ ఛార్జీల పెంపును తక్షణమే ఉప సంహరించుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అదే విధంగా.. జనవరి 3న ఫీజు రీయంబర్స్ మెంట అంశం పైన పోరుబాట పట్టాలని జగన్ నిర్ణయించారు. విద్యార్ధులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్ తో విద్యార్ధులతో కలిసి జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ప్రజల్లోనే ఉండేలా
విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని.. వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. జనవరి రెండో వారం తరువాత జిల్లాల పర్యటన ప్రారంభిస్తానని జగన్ మరోసారి తాజా సమావేశంలో స్పష్టం చేసారు. ప్రతీ బుధ, గురువారం జిల్లాల్లో ప్రతీ పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు...కేడర్ తో సమావేశం అవ్వనున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో కేడర్ తో మమేకం అవుతూ అన్ని అంశాలు చర్చకు వచ్చేలా సమావేశం ఉంటుందని వివరించారు. ఇక, ఇప్పుడు జగన్ ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రకటించిన తొలి నిరసన కార్యక్రమం కావటంతో రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications