చంద్రబాబుకు మాత్రం ఇవ్వం-వాళ్లకే ఇస్తాం-తేల్చేసిన వైసీపీ ..!
ఏపీలో వైసీపీకీ, కూటమిలో పార్టీలకు మధ్య కొంతకాలంగా సాగుతున్న రాజకీయ పోరు ప్రభావం విజయవాడ వరద బాధితులపైనా పడుతోంది. విజయవాడలో భారీ వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో చాలా మంది స్పందిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది.
విజయవాడ వరద బాధితుల కోసం వైసీపీ తరఫున కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు గతంలో మాజీ సీఎం జగన్ ప్రకటించారు. అంత కాదు ఈ మొత్తం ఎలా అందించాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు. ఇప్పుడు దానిపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టత ఇచ్చారు. విజయవాడ వరద బాధితుల కోసం తాము అందించే సాయాన్ని నేరుగానే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ తరపున కోటి రూపాయలు విరాళం ఇచ్చారు.. మళ్ళీ నిన్న కూడా ఒక పది లక్షలు ఇచ్చారు.
— YSR Congress Party (@YSRCParty) September 16, 2024
ప్రజలకు నేరుగా మేమే సహాయం అందిస్తున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది.. మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది బాధితులకు మేమే పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్,… pic.twitter.com/Ytw48QYOc1
వైయస్ జగన్మోహన్ రెడ్డి మా పార్టీ తరపున కోటి రూపాయలు విరాళం ఇచ్చారని, మళ్ళీ నిన్న కూడా ఒక పది లక్షలు ఇచ్చారని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలకు నేరుగా మేమే సహాయం అందిస్తున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది బాధితులకు మేమే పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కావాల్సిన నిత్యావసర సరుకులు అందిస్తున్నామని ఆయన స్పష్టత ఇచ్చేశారు. దీంతో విజయవాడ వరద బాథితుల కోసం అందించే విరాళాల్ని ప్రభుత్వానికి ఇవ్వబోవడం లేదని వైసీపీ తేల్చిచెప్పినట్లయింద.
-బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలి విపక్ష నేత












Click it and Unblock the Notifications