బాబుపై రాష్ట్ర వ్యాప్త (ఫోటోలు)
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పిలుపు మేరకు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు, డ్వాక్రా మహిళలు, ఫించనుదారులు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలోని 661 మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు.
ర్యాలీలు, ధర్నాలు, రాస్తరాకోతో మండల కేంద్రాలను ముట్టడించారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులను దిగ్బంఛగా.. మరికొన్ని ప్రాంతాల్లో బైకు ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని మండల కేంద్రాల్లో తహశీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.
అనంతపురం జిల్లా పాదయాత్రలో రైతు రుణాలను మాఫీ చేస్తానని బాబు ప్రకటించారని, ఇప్పుడు షరతులు విధిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకమండలి సభ్యుడు గురనాథరెడ్డి దుయ్యబట్టారు. ఇది ఆరంభం మాత్రమేనని, చంద్రబాబు సర్కారు గద్దేదిగే దాకా ఉద్యమిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట రామి రెడ్డి హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో తహశీల్దార్ కార్యాలయానికి తాళాలు వేసి పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శ్రీకాకుళం సోంపేటలో మాజీ ఎమ్మెల్యే పిరాయ సాయిరాజ్ను అరెస్టు చేశారు.
మాట తప్పిన బాబును ప్రశ్నించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో కొనసాగడం కష్టమేనని, ఆయన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
గుంటూరు జిల్లాలోని మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్యెల్యే కోనా రఘుపతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేపల్లెలోని స్ధానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్ ఖాన్ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గౌతం రెడ్డి, వంగవీటి రాధాతోపాటు డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
ఇది ఆరంభం మాత్రమేనని, చంద్రబాబు సర్కారు గద్దేదిగే దాకా ఉద్యమిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట రామి రెడ్డి హెచ్చరించారు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో తహశీల్దార్ కార్యాలయానికి తాళాలు వేసి పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
చిత్తూరు జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యేతో పాటు నిరసనకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
గుంటూరు జిల్లాలోని మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్యెల్యే కోనా రఘుపతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
రేపల్లెలోని స్ధానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
కర్నూలు జిల్లాలో తహశీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
గుంటూరు జిల్లాలోని మంగళగిరిలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్యెల్యే ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు.
బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
నెల్లూరు జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎంపీ మేకపాటి ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
నెల్లూరు జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
కడపలోని రాజం పేట మండలంలో మాట తప్పిన బాబును ప్రశ్నించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు.
బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్యెల్యే బోసు నిరసన తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం తహశీల్దార్ కార్యాలయంలో నిరసన పత్రాన్ని ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
శ్రీకాకుళం జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయంలో మాజీ ఎమ్యెల్యే ధర్మాన నిరసన తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు.

బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన
విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, జలీల్ ఖాన్ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గౌతం రెడ్డి, వంగవీటి రాధాతోపాటు డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ నగర పాలక సంస్ధ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా స్ధానిక గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేకా శేషుబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నర్సాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నేత కొత్తపల్లి జానకీ రామ్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications