జగన్ మాజీ మంత్రి జనసేనలో ఎంట్రీకి బ్రేక్, తిరిగి మళ్లీ..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు 2029 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ త్వరలోనే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటించి కార్యకర్తలతో సమావేశాలకు సిద్దం అవుతున్నారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూటమి పార్టీల్లో చేరారు. కాగా, కొంత కాలంగా వైసీపీ మాజీ మంత్రి కూటమిలో ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన ప్రయత్నాలు ఫలించటం లేదు. దీంతో... ఆ మాజీ తాజా నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారింది.
వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడారు. అందులో కొందరు కూటమి పార్టీల్లో చేరారు. సాయిరెడ్డి సైతం పార్టీ వీడినా..తన ట్వీట్లతో సంచలనంగా నిలుస్తున్నారు. ఇక.. వైసీపీని వీడి టీడీపీలో చేరిన మోపిదేవి..ఆళ్ల నాని.. జనసేనలో చేరిన బాలినేనికి ఇప్పటి వరకు ఆ పార్టీల్లో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. అదే విధంగా మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారనే స్పష్టత కొరవడుతోంది. ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా, టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన అవంతి... 2019 ఎన్నికల వేళ వైసీపీలో చేరారు.

భీమిలి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. కాగా, 2024 ఎన్నికల్లో తన మాజీ సహచరుడు గంటా పైన పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీకి దూరమయ్యారు. వైసీపీలో పరిస్థితుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కాగా.. అవంతి చాలా కాలం గా జనసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
అవంతి శ్రీనివాస్ ను జనసేనలో చేర్చుకునేందుకు విశాఖ టీడీపీ నేతల అభ్యంతరాలతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆసక్తిగా లేరని తెలుస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో పవన్ పైన అవంతి పలు విమర్శలు చేసారు. అదే విధంగా అవంతిని పలు సందర్భాల్లో పవన్ సైతం టార్గెట్ చేసిన అంశాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా టీడీపీ ముఖ్య నేతలు సైతం అవంతిని తిరిగి కూటమిలో చేర్చుకునేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తొలుత సన్నిహితులుగా కొనసాగిన గంటా, అవంతి మధ్య గత ఎన్నికల ముందు డైలాగ్ వార్ కొనసాగింది.
అయితే, విశాఖ కార్పొరేటర్ గా ఉన్న తన కుమార్తె ను కూడా వైసీపీ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం సందర్భంగా రాజీనామా చేయించారు. అయినా సరే అవంతి శ్రీనివాస్ ను మాత్రం ఎవరూ నమ్మడం లేదు. దీంతో.. అవంతి ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. కూటమి పార్టీల్లోకి ఆయన కు గ్రీన్ సిగ్నల్ వస్తుందా.. లేక, తిరిగి మళ్లీ వైసీపీలోనే కొనసాగుతా అనేది తేలాల్సి ఉంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications