వైసీపీ ముఖ్య నేతలకు సాయిరెడ్డి ఉచ్చు- జగన్ బిగ్ డెసిషన్..!!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సాయిరెడ్డి టెన్షన్ మొదలైంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ సాగిస్తున్న వేళ సాయిరెడ్డి కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించి.. వారికి ఉచ్చు బిగించారు. కూటమికి ఈ పరిణామాలు వరంగా మారుతున్నాయి. దీంతో, జగన్ అలర్ట్ అయ్యారు. ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. రానున్న రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
సాయిరెడ్డి వ్యాఖ్యలతో
వైసీపీ మాజీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేతలకు టెన్షన్ గా మారారు. తాజాగా కాకినాడ పోర్టు గురించి సీఐడీ విచారణకు హాజరైన సాయిరెడ్డి రెండు ప్రధాన అంశాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పోర్టు వ్యవహారంలో అంతా సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కర్మ, కర్త, క్రియగా పేర్కొన్నారు. పరోక్షంగా విక్రాంత్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపారనే అభియోగాల వేళ సాయిరెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదే సమయంలో లిక్కర్ స్కాంలోనూ ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ స్కాంలో సూత్రధారి .. పాత్రధారిగా పేర్కొన్న సాయిరెడ్డి.. భవిష్యత్ లో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ పార్టీ నేతల కు కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

విచారణల పర్వం
ఇటు లిక్కర్ స్కాం లో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు.. టెండర్ల ఖరారు నుంచి అమ్మకాల వరకు చోటు చేసుకున్న పరిణామాల పైన సీఐడీ ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ తమ సోషల్ మీడియా ఖాతాలో సంచలన ఆరోపణలు చేసింది. మిథున్ రెడ్డి సైతం తమ పైన రాజకీయ కోణంలోనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇటు లిక్కర్ స్కాంలో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోందనే చర్చ కూటమి ముఖ్య నేతల్లో జరుగుతోంది. త్వరలోనే నోటీసులు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. సాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను విచారణలో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
జగన్ వాట్ నెక్స్ట్
ఇక, సాయిరెడ్డి తాజాగా పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేసారు. కోటలో రాజు ప్రజల్లోకి రావాలని సూచించారు. కోటరీ మాటలు వింటే కోట కూలిపోతుందని.. రాజ్యం పోతుందని సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. సీఎంగా ఉన్న సమయంలో జగన్ ప్రజలను కలవని అంశాన్ని.. ఇప్పటికైనా ఇక ప్రజల్లోకి రావాలనే విషయాన్ని జగన్ కు సూచించారు. ఇటు జగన్ పార్టీ నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. సాయిరెడ్డి వ్యాఖ్యల పైన పార్టీ నేతలు స్పందిస్తున్నారు. జగన్ తాజాగా సాయిరెడ్డి వ్యాఖ్యల గురించి ముఖ్య నేతలు ప్రస్తావన చేసినా.. స్పందించలేదని తెలుస్తోంది. ఇక.. వచ్చే నెల నుంచే జిల్లా పర్యటనలు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాగా, పోర్టు వివాదం .. లిక్కర్ స్కాంలో ఇప్పుడు సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. ఈ కేసుల్లో తదుపరి విచారణలో సాయిరెడ్డి పాత్ర ఉంటుందా.. ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications