ఎమ్మెల్యే బాలయ్య మిస్సింగ్!?: హిందూపురం వన్ టౌన్లో ఫిర్యాదు..
బాలకృష్ణకు సినిమాలపై ఉన్నంత శ్రద్ధ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై లేదని, అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేశారని ఫిర్యాదులో వైసీపీ నేతలు పేర్కొన్నారు.
హిందూపురం: ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నప్పటికీ.. రాజకీయాల కన్నా సినిమాలకే పెద్ద పీఠ వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అడపా దడపా ఎప్పుడో ఒకసారి తప్పించి నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. ఫలితంగా సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరు పరిష్కరిస్తారో తెలియక జనం ఇబ్బందులు పడుతున్నారు.

ఇదే విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రతిపక్షం వైసీపీ.. ఎమ్మెల్యే బాలకృష్ణ తీరును ఎండగడుతూ.. కనిపించకుండా పోయారని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలకృష్ణకు సినిమాలపై ఉన్నంత శ్రద్ధ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై లేదని, అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేశారని ఫిర్యాదులో వైసీపీ నేతలు పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారు.
మరోవైపు వైసీపీ ఆరోపణలను స్థానిక టీడీపీ నాయకులు ఖండించారు. హిందూపురంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications