వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ 'క్లాస్' ఎఫెక్ట్: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను చిక్కుల్లోకి నెడుతారా?

రామ్‌నాథ్ కోవింద్ పరిచయ కార్యక్రమంలో జగన్ దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారని, వారితో కాళ్లు మొక్కించుకున్నట్లుగా తెలుస్తోందన్న ఆంధ్రజ్యోతి కథనంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పరిచయ కార్యక్రమంలో వైసిపి అధినేత జగన్ దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారని, వారితో కాళ్లు మొక్కించుకున్నట్లుగా తెలుస్తోందన్న ఆంధ్రజ్యోతి కథనంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిప్పులు చెరిగారు. ఆమెతో పటు ఎమ్మెల్యేలు కళావతి, పుష్పశ్రీవాణిలు మరోసారి నిప్పులు చెరిగారు. గిరిజన, దళిత ఎమ్మెల్యేలను అవమానించిన ఆంధ్రజ్యోతిపై కేసు వేస్తామని హెచ్చరించారు.

చదవండి: జగన్ కాళ్లు మొక్కించుకున్నారంటూ..: ఆంధ్రజ్యోతిపై ఆగ్రహం వెనుక

ఇంత అన్యాయంగా, దారుణంగా అబద్దాలు ఎలా రాస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు తమను పేరుపేరునా జగన్ పరిచయం చేశారన్నారు.

YSRCP MLAs warn Radhakrishna case against Andhra Jyothy

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో తాము ఫోటో దిగితే జగన్ క్లాస్ తీసుకున్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తాము ఫోటోలు దిగితే జగన్ జీర్ణించుకోలేదని చెప్పడం దుర్మార్గమన్నారు.

గిరిజన టీచర్లకూ ఏకీకృత సర్వీస్ రూల్స్ వర్తింపు కోరుతూ వెంకయ్యకు వినతిపత్రం ఇవ్వాలా వద్దా అని తాము సంశయించామని, ఇదే విషయాన్ని జగన్‌ను అడిగితే.. వెంకయ్యకు ఇవ్వండని తమకు చెప్పారని తెలిపారు.

English summary
YSRCP MLAs warn Radhakrishna case against Andhra Jyothy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X