మిథున్ రెడ్డికి షాక్: బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డికి తిరుపతి కోర్టు బుధవారం నాడు బెయిల్ నిరాకరించింది. చిత్తూరు జిల్లా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా అధికారిపై దాడి కేసులో మిథున్ రెడ్డి అరెస్టయ్యారు.
ఈ కేసులో భాగంగా కొద్దిరోజుల క్రితం మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి ఎంపీకి రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అతని బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

కాగా, ఎంపీ మిథున్ రెడ్డిని హైడ్రామా మధ్య పోలీసులు నాలుగు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాడు అరెస్ట్ అనంతరం అతనికి శ్రీకాళహస్తి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని జైలుకు తరలించారు.
కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయ మేనేజర్ పైన దాడి కేసులో గత శనివారం రాత్రి అతడు అరెస్టయ్యాడు. గట్టి బందోబస్తు మధ్య ఆదివారం ఉదయం చెన్నై నుంచి శ్రీకాళహస్తికి మిథున్ రెడ్డిని తీసుకువచ్చి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై జడ్జి ఇంటికి తీసుకువెళ్లి హాజరు పరిచారు. జడ్జి రిమాండ్ విధించారు. తాజాగా బెయిల్ నిరాకరించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications