చంద్రబాబు ఏపీకి రావడానికి కారణం చెప్పిన వైసీపీ ఎంపీ: అక్కడ నో సేఫ్: అదే ప్రజాసేవ: సెటైర్లు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అరెస్టు భయం పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆ భయంతోనే ఆయన హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రోజువారీ విచారణ ప్రారంభించిన నేపథ్యంలో.. తెలంగాణ ఉంటే సేఫ్ కాదనే ఉద్దేశంతోనే చంద్రబాబు స్వరాష్ట్రానికి వచ్చారని ధ్వజమెత్తారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఆయన ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ఓటుకు నోటు కేసును తిరగదోడుతోందని సాయిరెడ్డి అన్నారు.
తెలంగాణలోని అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం ఓటుకు నోటు కేసులో రోజువారీ విచారణ చేపట్టిందని చెప్పారు. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ చంద్రబాబుదేనంటూ ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్ధారించిందని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా పక్కాగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. రోజువారీ విచారణ సందర్భంగా హైదరాబాద్లో ఉంటే భద్రత లేదనే కారణంతోనే చంద్రబాబు కరకట్టకు పారిపోయి వచ్చారని ప్రజలు గుసగుసలాడుతున్నారని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

'వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు ఒక్క గాలి వానకు కుప్పకూలిందనే సామెత చంద్రబాబు లాంటి వారి కోసమే పుట్టి ఉంటుందని సాయిరెడ్డి చురకలు అంటించారు. ఓటుకు కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేకపోవచ్చని సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇన్నిరోజులూ హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు హుటాహుటిన ఉండవల్లిలోని తన కరకట్ట నివాసానికి రావడానికి ఓటుకు నోటు కేసు విచారణే కారణమని అన్నారు.
అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి శోకాలు తప్ప ప్రజల కోసం చంద్రబాబు ఏనాడైనా నోరు విప్పారా? అని విజయసాయి రెడ్డి నిలదీశారు. ఎప్పుడో ఒకసారి సందర్శకుల్లా రావడం, అమరాతి ప్రాంత రైతులను రెచ్చగొట్టేలా ప్రసంగించడం మినహా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ సాధించింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. అలా రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇవ్వడమే ప్రజాసేవగా భావిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా వారు జీతభత్యాలు తీసుకుంటున్నారని, కనీసం అందుకైనా రాష్ట్రానికి పనికి వచ్చే సలహాలు ఇవ్వాలని సూచించారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications