బహుళ రాజధానులు కొత్తేం కాదు-సాయిరెడ్డి ఇంగ్లీష్ ట్వీట్-మా ప్లాన్ తో టీడీపీ మైండ్ బ్లాక్..
ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు రాజధానుల చర్చ నడుస్తోంది. అమరావతికి మద్దతుగా విపక్షాలు, మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ కత్తులు నూరుతున్నాయి. అమరావతి రైతులు పాదయాత్ర చేపడితే, దానికి కౌంటర్ గా ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానుల చర్చ చేపట్టింది. రేపోమాపో బిల్లు కూడా ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ బహుళ రాజధానులకు మద్దతుగా ట్వీట్ చేశారు.
భారత్ లో బహుళ రాజధానులు కొత్తేమీ కాదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో ముంబై, నాగపూర్ రూపంలో రెండు రాజధానులు ఉన్నాయని, జమ్ముకశ్మీర్ లో శ్రీనగర్, జమ్మూ రూపంలో రెండు రాజధానులున్నాయని, మధ్యప్రదేశ్ లో భోపాల్ లో రాజధాని, జబల్పూర్ లో హైకోర్టు ఉందని సాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే ఛత్తీస్ ఘడ్ లో రాజధాని రాయ్ పూర్ లోనూ, హైకోర్టు బిలాస్ పూర్ లో ఉందన్నారు. యూపీలోనూ లక్నోలో రాజధాని, అలహాబాద్ లో హైకోర్టు ఉందన్నారు. కేరళలోనూ త్రివేండ్రంలో రాజధాని, ఎర్నాకుళంలో హైకోర్టు ఉందన్నారు.

మరో ట్వీట్ లో జగన్ ముందుచూపును వ్యతిరేకించడంలో విపక్ష టీడీపీకి ఆలోచనలే కరువయ్యాయని సాయిరెడ్డి పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీ ఏపీ మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్న కర్నూలు, విశాఖ ప్రజల ఆగ్రహాన్ని మూటగట్టుకుంటోందన్నారు.

తద్వారా విశాఖ, కర్నూల్లో ప్రజల ఆకాంక్ష అయిన రాజధానుల్ని టీడీపీ వ్యతిరేకిస్తున్నట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో నిన్న సీఎం జగన్ రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సాయిరెడ్డి కూడా దానికి మద్దతుగా ట్వీట్ పెట్టారు.
-
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications