ఆ ఇద్దరు ఐపీఎస్ లపై సీబీఐ, ఎన్ఐఏ దర్యాప్తు ! మోడీకి రఘురామ ఫిర్యాదు..
ఏపీలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆరునెలలకే ఆ పార్టీతో విభేదించడం మొదలుపెట్టిన రెబెల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు.. తాజాగా మరో కలకలం రేపారు. గతంలో ఏపీలో చోటు చేసుకున్న ఓ వివాదానికి సంబంధించి ఇవాళ ప్రధాని మోడీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఇందులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాని మోడీని కోరారు. దీంతో ఎన్నికల వేళ రఘురామ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీలో రెండేళ్ల క్రితం వైసీపీ సర్కార్ సీఎం వైఎస్ జగన్ పై నిత్యం ఆరోపణలు చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఐడీతో రాజద్రోహం కేసు పెట్టించింది. దీంతో ఆయన్ను హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరుకు తీసుకొచ్చారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు చేసే సమయంలో సీఐడీ అధికారులు రఘరామను తమ కస్టడీలో హింసించినట్లు ఆరోపణలు చేసారు. అనంతరం ఈ ఆరోపణల్ని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది. ఆ కేసును రఘురామ ఇప్పుడు తిరగతోడుతున్నారు.

అప్పట్లో గుంటూరులో సీఐడీ కస్టడీలో తనను హింసించిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోడీకి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. అప్పట్లో తనను హింసించిన వారిలో వీరిద్దరూ కూడా ఉన్నారని ఆరోపించారు. దీంతో ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని రఘురామ కోరారు.
వాస్తవానికి రఘురామపై అప్పట్లో నమోదైన రాజద్రోహం కేసులో విచారణ కొనసాగుతుండగానే సుప్రీంకోర్టు రాజద్రోహం కేసులు నమోదు చేయొద్దని, అప్పటికే నమోదైన కేసుల్లోనూ దర్యాప్తు నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో రఘురామపై అప్పట్లో సీఐడీ నమోదు చేసిన కేసు ముందుకు సాగలేదు. కానీ కస్టడీలో హింసపై మాత్రం సుప్రీంకోర్టులో రఘురామ వేసిన పిటిషన్ మాత్రం పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానికి రఘురామ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications