YSRCP vs TDP..పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత
భిన్నమైన రాజకీయ వాతావరణం ఉండే పల్నాడులో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం గురజాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు జరిగాయి. గురజాల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు తాను వస్తానని, అక్కడికి ఎవరైనా సరే రావచ్చంటూ కాసు ప్రకటించారు.
చెప్పినట్లుగానే కాసు మహేష్ రెడ్డి గురజాలకు చేరుకున్నారు. టీడీపీ నాయకులెవరైనా చర్చుకు రావాలన్నారు. ఆదివారం పేరు చెప్పి టీడీపీ నాయకులు పారిపోయారని విమర్శించారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే యరపతినేని స్పందించారు. అభివృద్ధి పై చర్చ అనేది ఆటవిడుపు కారాదని, మరో 10 రోజుల్లో చర్చించడానికి కొత్త తేదీని ప్రకటిస్తామని, ఆరోజు ఎమ్మెల్యే రావాలని కోరారు.

గురజాలలో అభివృద్ధి లేదని, తాము అధికారంలో ఉన్నప్పుడు రూ.1500 కోట్లతో చేసిన అభివృద్ధేనంటూ యరపతినేని మండిపడ్డారు. దీనిపై కాసు స్పందించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గురజాల నియోజకవర్గంలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు కాసు ప్రకటించారు.
గతంలో కూడా ఇరువురు నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో పల్నాడు వేడెక్కింది. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హత్యలకు గురవుతున్నారంటూ యరపతినేని శ్రీనివాసరావు వైసీపీపై ఆరోపణలు చేశారు. వీటిని మహేష్ రెడ్డి ఖండించారు.
-
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం రద్దు.. పవన్ సంచలన నిర్ణయం వెనుక! -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
"ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి.. 5 వేల మందితో అఫైర్" -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications