ఎన్నికలకు వైయస్ జగన్ పార్టీ దూరం, తటస్థమే
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. తగిన సంఖ్యాబలం లేకపోకపోవడంతో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి గురువారం ధ్రువీకరించారు. ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని, తాము ఎవరి మద్దతూ తీసుకోకూడదని నిర్ణయించుకుంది.
ఇతర పార్టీల బలం మీద ఆధారపడి అభ్యర్థిని నిలబెడితే అది కుమ్మక్కు రాజకీయాల్లో భాగమేననేది తమ అభిప్రాయమని ఆయన అన్నారు. విభజనకు అనుకూలంగా మూడు రాజకీయ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్సించారు. శాసనసభ ఎన్నికల తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరిగితే ఓడిపోతామని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు భయపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రక్రియను ముందుకు జరిపేలా ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చాయని ఆయన అన్నారు అయితే, ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే సంఖ్యాబలం టిడిపికి ఇప్పుడు లేదని ఆయన అన్నారు. కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే రెండో అభ్యర్థిని తెలుగుదేశం నిలబెడుతోందని ఆయన న్నారు.
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు విషయంలో కేంద్ర సూచన మేరకే రాష్ట్రపతి వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను సజావుగా జరుపుకునేందుకే తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు గడువు పెంచారని ఆయన అన్నారు.
బిల్లుపై మారని వైఖరి
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభ చర్చ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన వైఖరిని మార్చుకోలేదు. బిల్లుపై ఓటింగ్ ఉండాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభా పక్ష నేత వైయస్ విజయమ్మ అన్నారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications