ఆంటీ బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటే కిటికిలో నుంచి చూసి వీడు ఏం చేశాడంటే?
బెంగళూరు: బెంగళూరు నగరంలో బతకాలంటే డబ్బులు బాగా ఖర్చు చెయ్యాలి, బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బెంగళూరు ఓ సొంత ఇల్లు ఉంది అంటే కచ్చితంగా వాళ్లు కోటీశ్వరులే. ఇక ఒక ఇంటి స్థలంలో నాలుగు లేదా ఐదు అంతస్తులు ఇల్లు కట్టి అద్దెలకు ఇచ్చారంటే నెల వచ్చే సరికి తక్కువ అంటే లక్ష రూపాయల అద్దె జోబులో వచ్చి పడిపోతుంది.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఏదో ఒక పని చేస్తూ జీవిస్తున్నారు. బాగా చదువుకుని ఉద్యోగం చెయ్యడానికి బెంగళూరు వచ్చిన ఓ యువకుడు పక్కింటి ఆంటీ స్నానం చేస్తుండగా కిటికీలోంచి చూసి ఇంతకాలం ఎంజాయ్ చేశాడు. అయితే పరిస్థితులు అనుకూలించపోవడంతో మనోడికి బెండ్ తీశారు.

బెంగళూరులోని మారతహళ్లిలోని మునేనకొళ్లాల సమీపంలోని మంజునాథనగర్ వేలాది ఇండ్లు అద్దెకు ఇచ్చారు. ఇదే ప్రాంతంలో నితిన్(25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో నితిన్ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు ఉద్యోగానికి వెలుతున్న నితిన్ రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు.
నితిన్ నివాసం ఉంటున్న బిల్డింగ్ లోనే ఓ ఆంటీ ఆమె భర్తతో కలిసి నివాసం ఉంటున్నది. ఉదయం పక్కింటి ఆంటీ ఆమె ఇంటిలో స్నానం చేస్తోంది. ఆ సమయంలో పక్కింటిలో నివాసం ఉంటున్న నితిన్ మహిళ స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూశాడు. కొంతసేపు మహిళ గుర్తించకుండా, స్థానికులు తనను గమనిస్తున్నారా ? లేదా ? అంటూ నితిన్ స్నానం చేస్తున్న మహిళను చూస్తూనే ఉన్నాడు.
అయితే స్నానం చేస్తున్న మహిళ తనను నితిన్ కిటికిలో నుంచి చూస్తున్నాడని గమనించిన మహిళ గట్టిగా కేకలు వేసింది. మహిళ భర్త, ఇరుగుపొరుగు వారు అక్కడికి వెళ్లారు. స్థానికులు వస్తున్నారని గమనించిన నితిన్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో స్థానికులు వెంబడించి నితిన్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.
నిందితుడు నితిన్ మహిళ స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి చాలా నెలలుగా చూస్తున్నాడని, అయినా ఇంతకాలం ఆ మహిళ గమనించలేదని, ఎప్పటిలాగే నిందితుడు ఉదయం మహిళ స్నానం చేస్తుంటే అతని పని అతను కొనసాగించి మహిళ చేతికి చిక్కాడని పోలీసులు అన్నారు. కొన్ని నెలల నుంచి మహిళ స్నానం చేస్తుంటే తాను చూస్తూనే ఉన్నానని నితిన్ విచారణలో అంగీకరించాడని, మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications