భారత్ బ్యాటరీ పవర్కు చైనా షాక్: ట్రేడ్ రూల్స్ పేరుతో కొత్త డ్రామా!
భారత్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సాధిస్తున్న పురోగతిని చూసి చైనా ఓర్వలేకపోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచ హబ్గా ఎదగాలన్న భారత్ లక్ష్యం చైనాకు కంటగింపుగా మారింది. భారత సర్కారు అందిస్తున్న భారీ ప్రోత్సాహకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమంటూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO)లో ఫిర్యాదు చేసింది.
చైనాకు ఎందుకంత మంట?
భారత సర్కారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీని ప్రోత్సహించడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. దీనివల్ల తమ మార్కెట్ దెబ్బతింటుందని చైనా ఆందోళన చెందుతోంది. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీలు, వాహనాల తయారీకి ఇస్తున్న ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాలు నిబంధనలకు విరుద్ధమని చైనా వాదిస్తోంది. భారత్ అవలంభిస్తున్న విధానాలు తమ దేశ ఉత్పత్తుల పట్ల వివక్ష చూపుతున్నాయని.. ఇది గ్లోబల్ ట్రేడ్ రూల్స్ ఉల్లంఘించడమేనని చైనా ఆరోపిస్తోంది. ఈ విషయంపై 2025 నవంబర్, 2026 జనవరిలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, చైనా నేరుగా ప్రపంచ వాణిజ్య సంస్థ వివాద పరిష్కార విభాగాన్ని ఆశ్రయించింది.

భారత్ ఇస్తున్న ప్రోత్సాహకాలు ఇవే..
భారత్ 2030 నాటికి రోడ్లపై 30 శాతం వాహనాలు ఎలక్ట్రిక్ రూపంలోనే ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రభుత్వం పలు సౌకర్యాలను కల్పిస్తోంది. పీఎం ఈ-డ్రైవ్(PM E-DRIVE) పథకం ద్వారా వాహనాల కొనుగోలుపై రాయితీలు ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ (GST) తగ్గింపు, రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100శాతం మినహాయింపు అందిస్తోంది. యూపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు సొంతంగా ఈవీ పాలసీలను ప్రకటించి క్యాష్ సబ్సిడీలను కూడా ఇస్తున్నాయి. పాత బ్యాటరీలను రీసైకిల్ చేసే కంపెనీలకు 'వేస్ట్ టు వెల్త్' మిషన్ కింద ప్రోత్సాహకాలు అందిస్తోంది.
భారత్కు సవాల్గా మారనుందా?
చైనా చేసిన ఈ ఫిర్యాదుపై జనవరి 27న జెనీవాలో జరిగే సమావేశంలో చర్చ జరగనుంది. ఒక ప్రత్యేక కమిటీని వేసి దర్యాప్తు చేయాలని చైనా కోరుతోంది. భారత్ మాత్రం తమ విధానాలు కేవలం దేశీయ పరిశ్రమలను బలోపేతం చేసేందుకేనని, ఇవి ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతాయని వాదిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తన పట్టును పెంచుకుంటున్న తరుణంలో చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు 'మేక్ ఇన్ ఇండియా'కు ఒక సవాల్గా మారాయి. మరి ఈ వాణిజ్య పోరాటంలో WTO ఎవరి వైపు నిలుస్తుందో వేచి చూడాలి.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications