బంగారం కొనాలనే ఆలోచనే చేయకండి ప్లీజ్..!
పసిడి, వెండి ధరలు సెప్టెంబర్ 4, గురువారం రోజున సరికొత్త రికార్డులను సృష్టించాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో పెట్టుబడిదారులు, సామాన్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,09,700 పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,450కి చేరుకుంది. అదే విధంగా, కేజీ వెండి ధర రూ.1,27,738కి ఎగబాకింది.
ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులే. అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర చరిత్రలో మొదటిసారిగా $3600 డాలర్లు దాటడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న నష్టాల పరంపర కారణంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం, వెండి వైపు మళ్లించడం దీనికి ప్రధాన కారణం.

బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం సామాన్యులకు చాలా భారంగా మారింది. 22 క్యారెట్ల ఆభరణాల ధరలు కూడా భారీగా పెరిగాయి. మరోవైపు, వెండి ధరలు కూడా పెరగడానికి పారిశ్రామిక డిమాండ్ ఒక కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు విలువైన లోహాల ధరలు విపరీతంగా పెరగడంతో భవిష్యత్తులో ఈ ధోరణి ఎలా కొనసాగుతుందన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications