యుద్ధం వచ్చేసింది: బంగారంతో పాటు ధరలు పెరిగే వస్తువులు
ఫిబ్రవరి 28, 2026.. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ లక్ష్యంగా గర్జించాయి. ఈ దాడుల శబ్దం పశ్చిమాసియాలో వినిపించినా, దాని ప్రకంపనలు మాత్రం ప్రతి భారతీయుడి వంటింటి వరకు తాకనున్నాయి. ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా సామాన్యుడి జేబును దెబ్బతీసే ఒక భారీ సంక్షోభం.
యుద్ధం మొదలవ్వగానే మొదటగా పెరిగేది పెట్రోల్, డీజిల్ ధరలు. ప్రపంచానికి చమురును అందించే కీలక మార్గాల్లో ఇరాన్ ఉంది. యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోతే, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి, భారత్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతాయి. పెట్రోల్ ధర పెరిగితే ఆటోమేటిక్ గా రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయల నుంచి పప్పు దినుసుల వరకు అన్నింటి ధరలకు రెక్కలొస్తాయి.

ముప్పులో 'రెడ్ సీ'- పెరగనున్న రవాణా ఖర్చులు:
భారతదేశం నుంచి యూరప్ దేశాలకు ఎగుమతి అయ్యే సరుకులు 80 శాతానికి పైగా 'రెడ్ సీ' (ఎర్ర సముద్రం) మార్గం ద్వారానే వెళ్తాయి. ఇప్పుడు యుద్ధం వల్ల ఈ మార్గం ప్రమాదకరంగా మారింది. నౌకలు ప్రయాణించాలంటే బీమా (Insurance) ఖర్చులు పెరుగుతాయి, లేదా నౌకలు సుదీర్ఘ మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, లాప్టాప్లు, విదేశీ యంత్రాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
బంగారం ధరలకు రెక్కలు..
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా పెట్టుబడిదారులు తమ డబ్బును షేర్ మార్కెట్ల నుంచి తీసి సురక్షితమైన బంగారంపై పెడతారు. దీనివల్ల బంగారం డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటాయి. ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో, ఈ యుద్ధం మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనుగోలును భారంగా మార్చనుంది.
ఆహార భద్రత -ఎగుమతులపై దెబ్బ..
భారత్ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు బాస్మతి బియ్యం, టీ, కాఫీ, మసాలా దినుసులు భారీగా ఎగుమతి అవుతాయి. యుద్ధం వల్ల ఈ ఎగుమతులు నిలిచిపోతే మన రైతులు, వ్యాపారస్తులు నష్టపోతారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలాగే ఇది కూడా ముదిరితే, ఎరువుల ధరలు పెరిగి వ్యవసాయ ఖర్చులు మరింత భారం కానున్నాయి.
మారిన వాణిజ్య సమీకరణాలు..
ఒకప్పుడు ఇరాన్ నుంచి మనం భారీగా చమురు కొనేవాళ్లం. కానీ అమెరికా ఆంక్షల వల్ల గత దశాబ్దంలో వాణిజ్యం 26 బిలియన్ డాలర్ల నుంచి 2.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. మరోవైపు ఇజ్రాయెల్తో మన రక్షణ సంబంధాలు పెరిగాయి. యుద్ధం వల్ల ఇజ్రాయెల్ నుంచి వచ్చే అత్యాధునిక రక్షణ పరికరాలు, డ్రోన్లు, క్షిపణుల దిగుమతిలో జాప్యం జరిగితే అది మన దేశ భద్రతపై కూడా ప్రభావం చూపుతుంది.
యుద్ధం అనేది కేవలం సరిహద్దులకే పరిమితం కాదు. మనం వాడే స్మార్ట్ఫోన్ నుంచి, రోజువారీ భోజనం వరకు ప్రతి అంశంపై ఇది ప్రభావం చూపుతుంది. ఉద్రిక్తతలు ఎంత త్వరగా తగ్గితే, సామాన్యుడి జేబుకు అంత ఉపశమనం లభిస్తుంది.
-
Trump: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు.. -
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ ఈయనే.. ఖమేనీ కంటే డేంజర్..! -
మన దేశంలో ఉన్న ఒకే ఒక 'ఇరాన్' హీరోయిన్ ఎవరో తెలుసా..? -
ఇరాన్తో యుద్ధం అమెరికా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుందో తెలుసా..? -
కీలక మలుపు తిరిగిన ఇరాన్ యుద్ధం.. చైనా ఎంట్రీ! -
Amazon: మంటల్లో డ్రోన్ సెంటర్లు-అమెజాన్ షాకింగ్-కస్టమర్లకు కీలక అప్డేట్..! -
"ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధం..!" -
ఇరాన్ యుద్దం ఎన్ని రోజులంటే? ట్రంప్ క్లారిటీ-చర్చలపైనా..! -
CBSE Board Exams postponed: సీబీఎస్ఈ పరీక్షలు మళ్లీ వాయిదా-ఎక్కడెక్కడంటే? -
వైరల్ వీడియో: ఖమేనీ మృతితో సంబరాల్లో మహిళలు.. సిగరెట్లు తాగుతూ..! -
Hormuz Risk to India: హార్ముజ్ జలసంధి మూసేసిన ఇరాన్-భారత్ కు ఇక..! -
ట్రంప్ మాస్టర్ ప్లాన్.. 30 సెకన్లలోనే ఖమేనీ, 30 మంది అధికారులు హతం.. -
PM Modi: మోడీకి నెతన్యాహు పర్సనల్ థ్యాంక్స్..! అందుకే..! -
గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలకు సర్కార్ అలర్ట్..! -
గల్ఫ్ దేశాల్లో తెలుగువాళ్లు.. సీఎం రేవంత్ కీలక సూచనలు..














Click it and Unblock the Notifications