వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కుంభకోణాల దెబ్బ: నష్టాల్లోనే ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: కుంభకోణాల దెబ్బతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. పీఎన్బీ, రోటోమాక్ వరుస కుంభకోణాలతో సోమవారం నష్టాలు చవిచూసిన మార్కెట్లు.. మంగళవారం కూడా అదేబాటలో నడిచాయి. మంగళవారం ఉదయం కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. చివరికు నష్టాల్లోనే ముగిశాయి.
సెన్సెక్స్ 71.07 పాయింట్లు నష్టపోయి 33,703.59పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 18పాయింట్ల నష్టంతో 10,360.40పాయింట్లకు చేరింది. ఫిబ్రవరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ఈ గురువారంతో ముగియనుండటంతో మదుపర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
రూపాయి మారకం విలువ రూ.64.79 వద్ద ట్రేడవుతోంది. వేదాంత, అంబుజా సిమెంట్స్, ఐడియా సెల్యూలర్, కోల్ ఇండియా, భారతీ ఇన్ ఫ్రాటెల్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, అరబిందో ఫార్మా తదితర కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి.
Comments
English summary
Benchmark indices BSE Sensex and NSE Nifty closed lower for a third session on Tuesday dragged by losses in private bank shares and as foreign investors continued to liquidate their positions.
Story first published: Tuesday, February 20, 2018, 17:54 [IST]