వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మూడేళ్ల కనిష్టానికి డాలర్: పెరిగిన రూపాయి మారకం విలువ
ముంబై: రూపాయి విలువ ఒక్కసారిగా పెరుగుదలను నమోదు చేసింది. బుధవారం ముగింపుతో పోలిస్తే గురువారం ఉదయం 22 పైసలు పెరిగింది. డాలర్ మారకంలో రూపాయి 22 పైసలు పెరిగి 63.47 వద్ద కొనుసాగుతోంది.
బుధవారం రూపాయి 9పైసలు లాభపడి 63.69వద్ద ముగిసింది. కాగా, డాలర్ స్వల్పంగా బలహీనపడటంతో ఇన్వెస్టర్లు మన దేశీయ కరెన్సీ వైపు మొగ్గు చూపడంతో ఈ రూపాయి విలువలో పెరుగుదల నమోదైనట్లు తెలుస్తోంది. మూడేళ్ల కనిష్టానికి డాలర్ విలువ పడిపోవడం గమనార్హం.
మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైం గరిష్టాల నుంచి స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బంగారం ధరల్లోనూ పెరుగుదల కొనసాగుతోంది. కాగా, దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ వ్యాఖ్యలే డాలర్ మరింత పతనం కావడానికి కారణంగా తెలుస్తోంది. బలహీనమైన కరెన్సీ స్వాగతించదగ్గదే అని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
English summary
The rupee gained 22 paise to 63.47 against the US dollar in early trade on increased selling of the American currency by exporters and banks. Besides, dollar's weakness against other currencies overseas also supported the domestic unit, forex dealers said.
Story first published: Thursday, January 25, 2018, 11:18 [IST]