Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐసీఐసీఐలో కార్పోరేట్ గవర్నెన్స్ ఉల్లంఘన జరిగిందా?: సెబీ నజర్

న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత విలువైన బ్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉన్నది ఐసీఐసీఐ బ్యాంక్. ఈ బ్యాంకులో కార్పొరేట్ గవర్నెన్స్‌లో లోపాలు, లొసుగులు ఉన్నాయా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీడియోకాన్‌కు రూ.3,250 కోట్ల రుణం దక్కేలా ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందాకొచ్చర్ సాయం చేశారని వస్తున్న ఆరోపణలపై స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి (సెబీ) దృష్టి సారించింది.

ఈ రుణ మంజూరులో కార్పొరేట్ గవర్నెన్స్‌లో లోపాలు జరిగాయా? అన్న అంశంపైనే సెబీ విచారించనున్నది. నిబంధనలు పాటించకుండా క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూపునకు కొచ్చర్ రుణమిచ్చారని, దీంతో ఆమె కుటుంబ సభ్యులే ఎక్కువగా లబ్ధి పొందారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు సెబీ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

ఐసీఐసీఐని అదనపు వివరాలివ్వాలని కోరిన సెబీ

ఐసీఐసీఐని అదనపు వివరాలివ్వాలని కోరిన సెబీ

2012 నుంచి బ్యాంకు లావాదేవీలపై అదనపు సమాచారం సమర్పించాలని కోరతామని సెబీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అవసరమైన చోట్ల అదనపు వివరణలను కోరనున్నట్లు తెలిపారు.
కొన్ని సంవత్సరాలుగా బ్యాంక్ ఇచ్చిన రుణాలు, ఇతర ఆర్థిక పరిస్థితులపై కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సెబీ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దేశంలో నాలుగో అత్యంత విలువైన బ్యాంకుగా ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1.8 లక్షల కోట్లు.

 నియంత్రణ సంస్థలకు సంత్రుప్తికర సమాధానాలిచ్చామన్న ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ఎంకే శర్మ

నియంత్రణ సంస్థలకు సంత్రుప్తికర సమాధానాలిచ్చామన్న ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ఎంకే శర్మ

కారణాలేమైనా చందాకొచ్చర్‌కు బాసటగా నిలిచింది ఐసీఐసీఐ డైరెక్టర్ల బోర్డు. వీడియో కాన్‌కు బ్యాంకుల కన్సార్టియం ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేసిన వైనంపై, 2016 బ్యాంకు లావాదేవీలపై నియంత్రణ సంస్థల సందేహాలను సంత్రుప్తికరంగానే తీర్చామని తెలిపింది. ‘మేం ఎల్లవేళ్లలా సంత్రుప్తికరమైన సమాదానాలు, వివరణలే సమర్పించాం' అని ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్ ఎంకే శర్మ తెలిపారు. దీనిపై 2016లోనే ఆర్బీఐకి వివరణ ఇచ్చామని తెలిపారు.

 ఐసీఐసీఐ బ్యాంకు రుణంపై కేంద్రం విచారణకు ఆదేశించాలి

ఐసీఐసీఐ బ్యాంకు రుణంపై కేంద్రం విచారణకు ఆదేశించాలి

వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రుణాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ అధికంగా లాభపడ్డారని ఇండియన్ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ట్రస్టీ అరవింద్ గుప్తా ఆరోపించారు. కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులు అధికంగా లాభపడ్డారనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని విచారణకు ఆదేశించాలని గుప్తా డిమాండ్ చేశారు.

అర్ధరాత్రి వరకు బ్యాంకింగ్ డిజిటల్ సేవలు

అర్ధరాత్రి వరకు బ్యాంకింగ్ డిజిటల్ సేవలు

పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కోసం బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(మార్చి 31న) బ్యాంకులు రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులతో పాటు అన్ని ఆర్‌బీఐ శాఖల కార్యాలయాలు కూడా రేపు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని పేర్కొంది. శనివారం అర్ధరాత్రి వరకు డిజిటల్‌ లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపింది. శనివారంతో 2017-18 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు శనివారం ఆఖరి తేదీ కావడంతో బ్యాంకుల సమయాన్ని పెంచినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కూడా పేర్కొంది. ఇక ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ వంటి ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ సేవలు కూడా శనివారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా ఏప్రిల్‌ 2న బ్యాంకులు సెలవు పాటిస్తాయని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+