Target: ఉద్యోగం కోసం వెళ్లిన యువతులు టార్గెట్, భర్తతో సరళ స్కెచ్, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్!
చెన్నై/తిరుపతి: ఉద్యోగం చెయ్యాలని గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వెలుతున్న యువతుల మీద దంపతుల కన్నుపడింది. సిటీకి చేరుకుని కంపెనీల్లో సరైన ఉద్యోగాలు చిక్కకపోవడంతో దిగులుగా తిరుగుతున్న యువతులను మహిళ పరిచయం చేసుకుంది. మీకు ఉద్యోగాలు వచ్చే వరకు మా ఇంట్లో ఉండండి, మంచి ఉద్యోగాలు వచ్చిన తరువాత వెళ్లండి అంటూ యువతులకు ఆమె మాయమాటలు చెప్పింది.
భర్త సహాయంతో విటులను సంప్రధించి ఇంటికి పిలిపించుకుని యువతులను బెదిరించి వారితో బలవంతంగా హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహించారు. యువతులు విటులతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన దంపతులు బ్లాక్ మెయిల్ చేసి వాళ్లు ఉద్యోగాలకు వెళ్లకుండా చేసి వ్యభిచారం చేయిస్తున్నారు.

కిలాడీ దంపతులు
చెన్నై సిటీలోని వన్నార్ పేట్ సమీపంలోని తిరువొత్తియూర్ హైవే సమీపంలోి అప్పర్ నగర్ లో సతీష్ కుమార్, సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు టిప్పుటాపుగా రెఢీ అయ్యి, ఖరీదైన దుస్తులు వేసుకుంటున్న సతీష్ కుమార్, సరళ దంపతులు బైక్ లో చెన్నై సిటీలో రౌండ్స్ కు వెలుతున్నారు.

యువతులను టార్గెట్ చేసి?
ఉద్యోగం చెయ్యాలని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల నుంచి చెన్నై సిటీకి వెలుతున్న యువతుల మీద సతీష్ కుమార్, సరళ దంపతుల కన్నుపడింది. చెన్నైకి చేరుకుని కంపెనీలు, ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు చిక్కకపోవడంతో దిగులుగా తిరుగుతున్న యువతులను సరళ పరిచయం చేసుకుంటున్నది.

భర్త అమ్మాయిల బ్రోకర్
మీకు ఉద్యోగాలు వచ్చే వరకు మా ఇంట్లో ఉండండి, మంచి ఉద్యోగాలు వచ్చిన తరువాత వెళ్లండి అంటూ యువతులకు సరళ మాయమాటలు చెప్పి ఆమె ఇంటికి పిలుచుకుని వెలుతోంది. భర్త సతీష్ కుమార్ విటులను సంప్రధించి ఇంటికి పిలిపించుకుని యువతులను బెదిరించి ఉద్యోగాల కోసం చెన్నై వెళ్లిన అమాయకులైన యువతులతో సరళ బలవంతంగా హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహించింది.

వీడియోలతో బ్లాక్ మెయిల్
యువతులు విటులతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన దంపతులు బ్లాక్ మెయిల్ చేసి వాళ్లు ఉద్యోగాలకు వెళ్లకుండా చేసి వ్యభిచారం చేయిస్తున్నారు. వన్నార్ పేట్ డిప్యూటీ పోలీస్ కమీషనర్ పవన్ కుమార్ రెడ్డికి మ్యాటర్ తెలిసింది. డీసీపీ పవన్ కుమార్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న సతీష్ కుమార్, సరళ దంపతులను అరెస్టు చేశారు.

యువతుల జీవితాలతో చెలగాటం
సరళ ఇంటిలో ఉన్న ఇద్దరు యువతులను రక్షించి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ఇప్పటికే సతీష్ కుమార్, సరళ దంపతులు ఇప్పటికే చాలా మంది యువతుల జీవితాలతో చెలగాటం ఆడారని, వారిని వేశ్యవాటిక కేంద్రాలకు తరలించారని పోలీసుల విచారణో వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications