Wife romance: తాగుబోతు భర్తపై తక్కువ అంచనా, బాత్ రూమ్ సీన్ తో షాక్, నగ్నంగా నడిరోడ్డులో !
చెన్నై/ టీ నగర్/ విల్లుపురం: కరోనా వైరస్ (COVID 19) దెబ్బతో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో నిజాయితీగా ప్రేమిస్తున్న ప్రేమికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో అక్రమ సంబంధాలు సాగిస్తున్న వారి కథ సరేసరి, తాగుబోతు భర్తను తక్కువ అంచనా వేసిన భార్య తన ప్రియుడిని నేరుగా ఇంటికి పిలిపించుకుంది. బెడ్ రూమ్ లో రాసలీలలు సాగిస్తున్న సమయంలో పిల్లలు చూడటంతో బాత్ రూమ్ లోకి మకాం మార్చింది. అసలే ఫుల్ గా పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి బాత్ రూమ్ లో భార్య రొమాన్స్ చూసి తట్టుకోలేకపోయిన భర్త కత్తి తీసుకుని రెచ్చిపోయాడు. నగ్నంగా నడిరోడ్డులో వెంటాడి ఒకరిని చంపేయడంతో స్థానికులు భయంతో హడలిపోయారు.

రఘవరన్ చక్కటి కాపురం
తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనం ప్రాంతానికి చెందిన రఘవరన్ (32), మహాలక్ష్మి (28) దంపతులకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రఘవరన్, మహాలక్ష్మి దంపతులకు గిరి (11), తమిళసెల్వి (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దిండివనంలో ఏదోచిన్నచిన్న పనులు చేసుకుంటూ రఘువరన్ భార్మ మహాలక్ష్మి పిల్లలను చక్కగా చూసుకునేవాడు. తరువాత అసలు కథ మొదలైయ్యింది.

తాగుబోతు కాదు వీరతాగుబోతు
రఘువరన్ చిన్నాచితకా పనులు చేస్తూ సంపాధిస్తున్న డబ్బులు మద్యం సేవించడానికి తగలేసేవాడు. చివరి తాగుబోతు నుంచి వీరతాగుబోతుగా ప్రమోషన్ సంపాధించుకున్న రఘువరన్ భార్య, పిల్లనుల పట్టించుకోవడమే మానేశాడు. కుటుంబ పోషణ భారం కావడంతో మహాలక్ష్మి ఊరు ఖాళీ చేసి చెన్నై వెళ్లి ఏదైనా పనులు చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.

సమీప బంధువుతో లింక్
సంవత్సరం క్రితం చెన్నై చేరుకున్న రఘువరన్, మహాలక్ష్మి దంపతులు కోటైమేడు ప్రాంతంలో దూరుపు బంధువు అయిన పద్మప్రియ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే కాపురం పెట్టారు. మహాలక్ష్మి బట్టల షోరూంలో ఉద్యోగంలో చేరింది. అదే షోరూమ్ లో పని చేస్తున్న తిరువొత్తియూరు నివాసి, రఘువరన్ దూరుపు బంధువు అయిన విఘ్నేష్ (25) అనే యువకుడు మహాలక్ష్మికి దగ్గర అయ్యాడు. ఇక అక్కడి నుంచి తాగుబోతు భర్త రఘువరన్ తో తాను ఎంజాయ్ చెయ్యలేనని బావించిన మహాలక్ష్మి విఘ్నేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. మహాలక్ష్మికి అవసరం అయినప్పుడు విఘ్నేష్ డబ్బులు ఇవ్వడంతో వాళ్లు ఇంకా దగ్గర అయ్యారు.

లాక్ డౌన్ తో సరసాలకు ఇబ్బంది
చెన్నై సిటీలో లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పటికే ఆ నగరంలో లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ దెబ్బకు బట్టల షోరూమ్ మూసివేయడంతో నాలుగు నెలల నుంచి మహాలక్ష్మి, విఘ్నేష్ లు బయట కలుసుకోవడం లేదు. ఎలాగైనా మహాలక్ష్మిని కలుసుకుని ఎంజాయ్ చెయ్యాలని విఘ్నేష్ అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి సాయంత్రం భర్త రఘువరన్ మద్యం సేవించడానికి బయటకు వెళ్లే సమయంలో నువ్వు ఇంటికి వచ్చి వెళ్లాలని ప్రియుడు విఘ్నేష్ కు ప్రియురాలు మహాలక్ష్మి ప్లాన్ ఇచ్చింది. వారం రోజుల నుంచి విఘ్నేష్ రోజూ సాయంత్రం మహాలక్ష్మి ఇంటికి వెళ్లి బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేసి వెలుతున్నాడు.

తాగుబోతు భర్తను తక్కువ అంచనా వేసిన భార్య
తన భర్త మద్యం సేవించడానికి బయటకు వెలుతున్న సమయంలో ప్రియుడు విఘ్నేష్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆమె పిల్లలు చూశారు. ఇక భర్త రఘువరన్ బయటకు వెళ్లిన సమయంలో, ప్రియుడు విఘ్నేష్ ఇంటికి వచ్చే సమయంలో మహాలక్ష్మి పిల్లలను సాటి స్నేహితులతో ఆడుకోవాలని చెప్పి బయటకు పంపించేది. బెడ్ రూమ్ లో సమస్య వస్తుందని భయపడిన మహాలక్ష్మి ప్రియుడు విఘ్నేష్ తో కలిసి బాత్ రూమ్ కు మకాం మార్చింది. భర్త వచ్చినా ఇంట్లో ఉంటాడని, బాత్ రూమ్ వరకు రాడని మహాలక్ష్మి తాగుబోతు భర్తను తక్కువ అంచనా వేసింది.

బాత్ రూమ్ సీన్ చూసి కిక్కులో ఏం చేశాడంటే ?
గురువారం రాత్రి భర్త రఘువరన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే మహాలక్ష్మి ప్రియుడు విఘ్నేష్ ఎంట్రీ ఇచ్చాడు. తరువాత బాత్ రూమ్ లో మహాలక్ష్మి, విఘ్నేష్ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో పీకలదాక మద్యం సేవించిన రఘువరన్ ఒక్కసారిగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బాత్ రూమ్ లో భార్య మహాలక్ష్మి, విఘ్నేష్ ను నగ్నంగా చూసిన రఘువరన్ రెచ్చిపోయాడు. వంట గదిలో ఉన్న కత్తి తీసుకుని మహాలక్ష్మి మీద దాడి చేశాడు. ప్రియురాలికి కత్తిపోట్లు తగలకుండా అడ్డుపడిన విఘ్నేష్ మీద రఘువరన్ దాడి చేశాడు.

నో చాన్స్... నీ కథ క్లోజ్
కత్తిపోట్లకు గురైన రఘువరన్ ప్యాంట్ కూడా వేసుకోకుండా రోడ్డు మీదకు పరుగు తీశాడు. అసలే కిక్కు నసాలానికి ఎక్కిపోయిన రఘువరన్ కత్తి తీసుకుని రోడ్డు మీదపారిపోతున్న భార్య ప్రియుడు విఘ్నేష్ పట్టుకుని పదేపదే కత్తితో పోడవడంతో అతను నడిరోడ్డులో ప్రాణాలు వదిలాడు. భార్య ప్రియుడిని నడిరోడ్డులో దారుణంగా పొడిచి చంపిన రఘువరన్ ను చూసి స్థానికులు భయంతో పరుగు తీశారు. పోలీసులు రఘువరన్ ను అరెస్టు చేసి మహాలక్ష్మిని ఆసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications