కుప్పంలో ఈ కామర్స్ గోడౌన్లో ప్రమాదం: రూ.10 లక్షల ఆస్తి నష్టం
దీపావళి పండగ ముందు చిత్తూరు జిల్లాలో ప్రమాదం జరిగింది. కుప్పంలో గల ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్కు చెందిన గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్లో విలువైన పార్శిల్స్ ఉన్నాయట. అవన్ని అగ్నికి ఆహుతి అయినట్టు తెలుస్తోంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకుంది. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొని వచ్చింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు గోడౌన్ సిబ్బంది వెల్లడించారు. ప్రాణ నష్టం మాత్రం ఏమీ జరగలేదు.

దివాళి పండగ కోసం కస్టమర్స్ ఆర్నమెంట్స్ బుక్ చేసుకున్నారు. వాటిని కొద్దీరోజుల్లో డెలివరీ చేయాల్సి ఉంది. ఇంతలో ప్రమాదం జరిగింది. దీనికి ఇన్సూరెన్స్ ఉంటే కంపెనీ క్లెయిమ్ చేసుకోనుంది. లేదంటే ఆ మొత్తం కంపెనీ భరించాల్సిందే. కొందరు కస్టమర్స్ ముందే మనీ పే చేయడంతో వారికి ఆలస్యంగానైనా డెలివరీ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన వారితో ప్రాబ్లమ్ లేదు. ఐటెమ్స్ పూర్తిస్థాయిలో లేవని.. ఉంటే భారీ నష్టపోయే వారమని చెబుతున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications