Ex lover: భర్తకు హ్యాండ్ ఇచ్చి ఎస్కేప్, ప్రియుడితో కలిసి కొండ మీదనుంచి లోయలో దూకిన లేడీ !
బెంగళూరు: మూడు సంవత్సరాల నుంచి యువతి, యువకుడు ప్రేమించుకుని హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఇద్దరూ పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకున్నారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు మరో యువకుడితో బలవంతంగా ఆమె పెళ్లి జరిపించేశారు. భర్తతో కాపురం చేస్తున్న భార్య అప్పుడప్పుడు ఆమె మాజీ ప్రియుడిని కలిసి అతనితో ఎంజాయ్ చేసింది. భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. వివాహం జరిగిన సంవత్సరం తరువాత భార్య ఆమె ప్రియుడితో కలిసిపారిపోయింది. ఎత్తైన కొండ మీదకు ప్రియుడితో కలిసి వెళ్లిన వివాహిత మహిళ ఆక్కడి నుంచి ఇద్దరూ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న మూడు రోజుల తరువాత విషయం వెలుగు చూడటంతో ఆమె బంధువులు షాక్ అయ్యారు.

ప్రేమికులు
బెంగళూరు నగర శివార్లలోని కనకపురలో నివాసం ఉంటున్న చందనా (21) అనే యువతి, తమిళనాడులోని హోసూరు పట్టణంలో నివాసం ఉంటున్న సతీష్ (21) అనే యువకుడికి పరిచయం ఉంది. మూడు సంవత్సరాల నుంచి చందనా, సతీష్ ప్రేమించుకుని హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. చందనా, సతీష్ పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని అనుకున్నారు.

బలవంతంగా యువతి పెళ్లి చేశారు
సతీష్ వివాహం చేసుకోవడానికి చందనా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సంవత్సరంక్రితం చందనా కుటుంబ సభ్యులు రాజేష్ అనే యువకుడితో బలవంతంగా ఆమె పెళ్లి జరిపించేశారు. భర్త రాజేష్ తో చందనా ఇష్టం లేకుండా కాపురం చేస్తున్నది. ప్రియుడు సతీష్ మరిచిపోలేని చందనా భర్త రాజేష్ తో అంటిముట్టనట్లు ఉంటున్నదని సమాచారం.

సీక్రేట్ గా ప్రియుడిని కలుస్తున్న చందనా
చందనా అప్పుడప్పుడు పుట్టింటికి, ఆమె బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సమయంలో ఆమె ప్రియుడు సతీష్ తో ఎంజాయ్ చేసింది. భార్య చందనా అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆమెను భర్త రాజేష్ మందలించాడు. భర్త రాజేష్ తో పాటు కుటుంబ సభ్యులు మందలించినా చందనా మాత్రం ఆమె ప్రియుడిని మరిచిపోలేకపోయింది.

ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత మహిళ
వివాహం జరిగిన సంవత్సరం తరువాత చందనా ఇంటి నుంచి ఆమె ప్రియుడు సతీష్ దగ్గరకు పారిపోయింది. భర్త రాజేష్ తన భార్య కనపడటం లేదని కనకపుర పోలీస్ స్టేషన్ లో మూడు రోజుల క్రితం మిస్సింగ్ కేసు పెట్టాడు. అప్పటి నుంచి బంధువులు, కుటుంబ సభ్యులు చందనా కోసం గాలిస్తూనే ఉన్నారు.
Recommended Video

కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య
రామనగర జిల్లాలోని కబ్బాళు సమీపంలోని ఎత్తైన కొండ మీదకు ప్రియుడు సతీష్ తో కలిసి వెళ్లిన వివాహిత మహిళ చందనా ఆక్కడి నుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. చందనా, సతీష్ ఆత్మహత్య చేసుకున్న మూడు రోజుల తరువాత స్థానికులు విషయం గుర్తించి పోలీసుకు సమాచారం ఇచ్చారు. ప్రియుడు సతీష్ తో కలిసి చందనా ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూడటంతో ఆమె బంధువులు, భర్త రాజేష్ షాక్ అయ్యారు. చందనా, సతీష్ వివాహం చేసుకోవాలని అనుకున్నా మొండిగా ఆమె కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం చెయ్యడం వలనే వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ప్రియుడు సతీష్ తో కలిసి చందనా ఆత్మహత్య చేసుకోవడంతో మూడు కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications