ఆ ఇంటర్వ్యూలో తీన్మార్ మల్లన్న అన్ని హద్దులు దాటాడు.. డీజీపికి న్యాయవాది ఫిర్యాదు...
ప్రముఖ జర్నలిస్ట్,క్యూ న్యూస్ మీడియా అధినేత నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై ఓ న్యాయవాది డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ అత్యాచార బాధితురాలిని తన యూట్యూబ్ చానెల్లో ఇంటర్వ్యూ చేసిన మల్లన్న... అందులో అన్ని రకాలుగా హద్దు మీరి మాట్లాడాడని పేర్కొన్నారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తూడి అరుణ కుమారి అనే న్యాయవాది ఈ ఫిర్యాదు చేశారు.

సైకోలా మల్లన్న.. : తూడి అరుణకుమారి
ఆ ఇంటర్వ్యూలో బాధితురాలిని మల్లన్న అడిగిన కొన్ని ప్రశ్నలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. 139 మంది నిందితులను ఎన్కౌంటర్ చేసేందుకు 139 బుల్లెట్లు సిద్దం చేసుకోవాలని కమిషనర్ను మల్లన్న సవాల్ చేయడమేంటని ప్రశ్నించారు. మల్లన్న ఓ సైకోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అలాగే 'దిశ' ఎన్కౌంటర్ ఫేక్ అని మల్లన్న వ్యాఖ్యానించడం సుప్రీంకోర్టుతో పాటు నిర్భయ చట్టాన్ని అతిక్రమించడమేనని ఆరోపించారు. మల్లన్నపై డీజీపీ మహేందర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.

అత్యాచార కేసు....
కొద్దిరోజుల క్రితం వెలుగుచూసిన యువతిపై 139 మంది అత్యాచారం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదుతో ఈ కేసు వెలుగుచూసింది. అయితే తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడలేదని... రాజా శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తి బలవంతం వల్లే తాను అంతమంది పేర్లు చెప్పాల్సి వచ్చిందని బాధితురాలు తర్వాత వివరణ ఇచ్చుకుంది. పలు ప్రజా సంఘాలు,సామాజిక కార్యకర్తలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన బాధితురాలు తనపై 36 మంది అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. మిగతావాళ్లలో కొంతమంది వేధింపులకు పాల్పడగా... కొంతమందికి అసలు కేసుతో సంబంధం లేదని స్పష్టం చేసింది.
Recommended Video

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మల్లన్న...
ఇదిలా ఉంటే,త్వరలో జరగబోయే వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన యూట్యూబ్ చానెల్ ద్వారా వెల్లడించారు. గతంలోనూ ఓసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లన్న ఓటమిపాలైన సంగతి తెలిసిందే. గత ఏడాది జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిపాలయ్యారు. అయితే ఎప్పటికైనా చట్ట సభల్లోకి అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ఉన్న మల్లన్న మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications