డిప్యూటీ మేయర్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, ఎన్ఎస్యూఐ నేతపై ఫిర్యాదు
హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఓ స్థల వివాదంలో జోక్యం చేసుకోవడంతో స్థానికులు దాడి చేశారని ట్రోల్ అవుతోంది. అయితే దీనిని టీఆర్ఎస్ నేతలు ఖండించారు. బోరబండ వీకర్ సెక్షన్ కాలనీవాసులు... జరుగుతోన్న అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు.
బోరబండ వీకర్ సెక్షన్ కాలనీవాసులు సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల బోరబండలో స్థల వివాదం నెలకొందని కంప్లైంట్లో వివరించారు. అందులో ఒక వర్గానికి ఫసీయుద్దీన్ అండగా నిలిచారని.. మరో వర్గం దాడి చేసిందని తెలిపారు.

కానీ వాస్తవానికి స్థల వివాదంలో ఫసీయుద్దీన్ కల్పించుకోలేదని స్పష్టంచేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసింది ఎన్ఎస్యూఐ నేత స్వామి అని వారు ఆరోపించారు. చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో స్థానికులు సత్యనారాయణ, ఇతరులు ఉన్నారు.
కాలనీవాసుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ ప్రారంభించామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. మరోవైపు డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్పై అసత్య ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్వీ నేతలు కూడా మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసినవారిపై చర్యలు తీసకోవాలని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications