బడా షాపింగ్స్ మాల్స్ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్లోని మెహిదీపట్నం సర్కిల్లో పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలుషాపులను సీజ్ చేశారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్స్ ఉపయోగంపై నిషేధం విధించిన నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా పలు దుకాణాల్లో జీహెచ్ఎమ్సీ అధికారులు దాడులు కొనాసాస్తున్నారు. మరోవైపు ట్రేడ్ లైసెన్స్తో పాటు ఇతర పార్కింగ్ సౌకర్యాలు లేని షాపింగ్ మాల్స్పై తనిఖీలు చేసి పలు షాపులను సీజ్ చేశారు.
ట్రేడ్ లైసెన్స్ లేకుండా, పార్కింగ్ సౌకర్యం లేకుండా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్న దుకాణాలు, వ్యాపార సంస్థల్లో దాడులు చేసి వాటిని సీజ్ చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ట్రేడ్ లైసెన్స్ లేకుండా మెహిదీపట్నంలో నిర్వహిస్తున్న చెన్నై సిల్క్స్, విజయ నగర్ కాలనీ సమీపంలోని ఎన్ఎండీసీ వద్ద ఉన్న సూపర్ మార్కెట్ను సీజ్ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్న మెహిదీపట్నంలోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ను కూడా సీజ్ చేశారు. మహావీర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న మోర్ సూపర్ మార్కెట్కు పార్కింగ్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు రూ.25 వేల జరిమానా విధించారు. మరోవైపు మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నందుకు గాను సీజ్ చేశారు.

కాగ గతవారమే పలు సర్కిళ్లలోని హోటళ్లలో తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారలు ప్రముఖ హోటర్ ప్యారడైజ్ హోటళ్తో పాటు, హోటల్ అభినందన్ పై లక్ష రూపాయల జరిమాన విధించారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications