పసుపు మరియు ఎర్రజొన్నల మద్దతు ధర కోసం వంటావార్పు నిర్వహించిన నిజామాబాద్ రైతులు...
హైద్రబాద్ ....మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ..నిజామాబాద్ ఎర్రజోన్న,పసుపు రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు , ఆర్మ్రర్ మండలంలోని పెర్కిట్ వద్ద జాతియ రహదారిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు...రోడ్డు పైనే వంటావార్పు చేశారు..అక్కడే బోజనాలు చేశారు.ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సుమారు 12 గంటలపాటు ధర్నా కొనసాగించారు..మరోసారి ఈనెల 19 న జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు .ఎర్రజోన్న,పసుపు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేవరకు తమ అందొళన కొనసాగుతుందని హెచ్చరించారు.
..ఎర్రజోన్న విత్తనాలు సరఫరా చేసిన వ్యాపారులు ప్రస్తుతం వాటికి గిట్టుబాట ధర లేక కొనుగోళ్లు చేయడం లేదు..దీంతొ జిల్లాలో పండిన పంటకు సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్నారు..ఈనేపథ్యంలోనే ప్రభుత్వమే గత సంవత్సరం లాగా ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు..
దీంతోపాటు పసుపు ధర సైతం క్వింటాలుకు 4000 నుండి 5000 వరకు మాత్రమే వ్యాపారులు కొంటున్నారు..దీంతో పెట్టుబడి కూడ సరిగా రాని పరిస్థితి ఈనేపథ్యంలోనే ఎర్రజోన్న,పసుపు రైతులు గిట్టుబాటు ధరల కోసం గత వారం క్రితం ఆందోళన బాట పట్టిన రైతులు ,ఎంపి కవితకు వినతి పత్రం అందించారు.ఎర్రజోన్నలను ప్రభుత్వం కొనడంతో పాటు ,పసుపు క్వింటాలుకు 15000 వేల మద్దతు ధర రుపాయలు కల్పించాలంటూ వినతిపత్రంలో పేర్కోన్నారు..అయితే ఎంపీ కవిత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళతానని హామి ఇచ్చారు...
అయితే వారం రోజులపాటు అందోళన చేపట్టిన సరైన న్యాయం జరగకపోవడంతో మరోసారి రోడ్డేక్కారు..కాగా ముఖ్యమంత్రి కేసిఆర్ స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డి తల్లి దశదినకర్మకు హజరవుతున్న నేపథ్యంలో విషయం ఆయన దృష్టికి వెళ్లేలా చేశారు..రెండు రోజుల్లో గిట్టుబాటు ధరపై స్పష్టత రాకపోతే మరోసారి ఈనెల 19 న జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు...
రైతు పక్షపాతిగా ఉన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మరో రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాయా లేదా వేచి చూడాలి...