జాతీయ పంచాయతీ అవార్డుల్లో సత్తా చాటిన తెలంగాణ: ఏకంగా 8 అవార్డులు
హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. 2023 సంవత్సరం దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 27 అవార్డులు ప్రకటిస్తే వీటిలో ఏకంగా ఎనిమిది అవార్డులు రాష్ట్రానికి దక్కడం గమనార్హం.
జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో ప్రకటించిన మొదటి తొమ్మిది కేటగిరీల్లో.. నాలుగు కేటగిరీల్లో తెలంగాణనే మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్ హెల్తీ పంచాయతీ కేటగిరీలోమొదటి స్థానంలో నిలిచింది. జనగామ జిల్లా నెల్లుట్ల వాటర్ సఫిషియెంట్ పంచాయతీ విభాగంలో తొలి స్థానం దక్కించుకుంది.

మహబూబ్నగర్ జిల్లా కొంగట్పల్లి సోషియల్లీ సెక్యూర్డ్ పంచాయతీ విభాగంలో మొదటి స్థానం సాధించింది. సూర్యపేట జిల్లా ఐపూర్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు, జోగులాంబ గద్వాల జిల్లా మాన్ దొడ్డి పావర్టీ ఫ్రీ విభాగంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. వికారాబాద్ జిల్లా చీమల్ దర్రి పంచాయతీ గుడ్ గవర్నెన్స్ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది.
పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్ క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా మూడో స్థానంలో నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రా విభాగంలో మూడోస్థానం దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం తొమ్మిది కేటగిరీల్లో శుక్రవారం ప్రకటించిన మొత్తం 27 అవార్డుల్లో ఎనిమిది రాష్ట్రానికి రావడం విశేషం. ప్రత్యేక కేటగిరీ విభాగంలో సోమవారం మరిన్ని అవార్డులను ప్రకటించే అవకాశం ఉండటంతో.. వీటిలో కూడా తెలంగాణకు అవార్డులు వచ్చే అవకాశంఉంది.
Telangana shines yet again ✊
— KTR (@KTRBRS) April 7, 2023
Best performer in National Panchayat Awards
✅ Highest Rise in Per Capita
✅ Best Gram Panchayats
✅ 100% ODF + Villages as per Govt of India
All credit to Visionary CM KCR Garu and his brainchild “Palle Pragathi” which has uplifted the villages… pic.twitter.com/Esc38P7zwA
జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలు సాధించిన ఘనతపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం.. ఉత్తమ గ్రామ పంచాయతీలు.. వందశాతం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు అన్నీ తెలంగాణలోనే ఉన్నాయన్నారు. దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే అద్భుతమైన పనితీరు కనబర్చినట్లు తెలిపారు. కేసీఆర్ మానసపుత్రిక పల్లెప్రగతితో గ్రామాల రూపురేకలు మారుతున్నాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications