Indigo: ఇండిగోకు షాక్.. హైదరాబాద్ దంపతులకు పరిహారం ఇవ్వాలని ఆదేశం..
ఇండిగో ఎయిర్ లైన్స్ షాక్ తగిలింది. 2021లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించిన సమయంలో హైదరాబాద్కు చెందిన దంపతులకు రూ.10,000 పరిహారం చెల్లించాలని ఇండిగో ఎయిర్లైన్స్ని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. అపరిశుభ్రమైన విమానం కారణంగా ఈ ఫైన్ విధించారు. ఈ విషయాన్ని ఫిర్యాదుదారు డి రాధాకృష్ణ తెలిపారు. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్-1 హైదరాబాద్లో విమానంలో అపరిశుభ్రతపై రాధాకృష్ణ ఫిర్యాదు చేశారు.
కోచ్లో చెత్త, ప్లాస్టిక్ సీసాలు, ఉపయోగించిన నాప్కిన్లతో నింపారని ఆయన ఆరోపించారు. విమానంలో అపరిశుభ్రత కారణంగా, తన జీవిత భాగస్వామికి వికారం, వాంతులు వచ్చినట్లు ఆయన తెలిపారు. మరోవైపు, విమానంలో పరిస్థితుల కారణంగా తన జీవిత భాగస్వామి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ఫిర్యాదుదారు గతంలో ఎన్నడూ ప్రస్తావించలేదని ఇండిగో ఆరోపించింది.

ఇరుపక్షాల వాదనలు విన్న బెంచ్, ప్రయాణికులను ఎక్కే ముందు ఇండిగో పరిశుభ్రత పాటించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. జులై 1 నుంచి 45 రోజుల్లోగా పరిహారం మొత్తాన్ని చెల్లించాలని ఎయిర్లైన్స్ను ఆదేశించింది. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ తన ఫ్లైట్ రద్దు గురించి తక్షణమే తెలియజేయడంలో విఫలమైనందుకు హైదరాబాద్ వ్యక్తికి రూ.30,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్-II హైదరాబాద్ మార్చి 28 నుండి 45 రోజుల్లోగా పరిహారం మొత్తాన్ని చెల్లించాలని ఎయిర్లైన్ను ఆదేశించింది. గడువు ముగిసిన తర్వాత, 12 శాతం వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications