రేషన్ షాపు కోసం రగడ: కాల్పులు జరిపిన బీజేపీ నేత, ఒకరి మృతి, సీఎం సీరియస్
ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. రేషన్ షాపుల కేటాయింపుపై గొడవకు దారితీసింది. కోపోద్రిక్తుడైన బీజేపీ నేత కాల్పులు జరపడంతో.. ఓ యవకుడు మృతిచెందాడు. అయితే అధికారి ముందు ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘటనపై యోగి సర్కార్ స్పందించింది.
బల్లియా జిల్లా రియోటి ప్రాంతం దుర్జాన్పూర్ ప్రాంతంలో రేషన్ షాపు కేటాయింపుపై చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ నేత ధీరేంద్ర సింగ్ కాల్పులు జరిపాడు. దీంతో జై ప్రకాశ్ పాల్ అనే వ్యక్తి చనిపోయాడు. ఫైర్ చేశాక.. దీరేంధ్ర సింగ్ అక్కడినుంచి పారిపోయాడు.

సమావేశంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని ఎస్పీ దేవేంద్ర నాథ్ తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోంది.. 20 మందిపై తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. బాధితుని సోదరుడు చంద్రమ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సురేశ్ పాల్పై సస్పెన్షన్ వేటు వేశారు. సర్కిల్ అధికారి చంద్రకేశ్ సింగ్, ఇతర పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Recommended Video
నిందితుడిని వదిలేయబోమని.. కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో అధికారుల బాధ్యతరాహిత్యం ఉంటే వారిపై చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. కాల్పుల నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసు బలగాలను మొహరించారు. పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications