Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేషన్ షాపు కోసం రగడ: కాల్పులు జరిపిన బీజేపీ నేత, ఒకరి మృతి, సీఎం సీరియస్

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. రేషన్ షాపుల కేటాయింపుపై గొడవకు దారితీసింది. కోపోద్రిక్తుడైన బీజేపీ నేత కాల్పులు జరపడంతో.. ఓ యవకుడు మృతిచెందాడు. అయితే అధికారి ముందు ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘటనపై యోగి సర్కార్ స్పందించింది.

బల్లియా జిల్లా రియోటి ప్రాంతం దుర్జాన్‌పూర్ ప్రాంతంలో రేషన్ షాపు కేటాయింపుపై చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ నేత ధీరేంద్ర సింగ్ కాల్పులు జరిపాడు. దీంతో జై ప్రకాశ్ పాల్ అనే వ్యక్తి చనిపోయాడు. ఫైర్ చేశాక.. దీరేంధ్ర సింగ్ అక్కడినుంచి పారిపోయాడు.

1 Killed after BJP Leader Fires into Crowd in Ballia..

సమావేశంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని ఎస్పీ దేవేంద్ర నాథ్ తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోంది.. 20 మందిపై తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. బాధితుని సోదరుడు చంద్రమ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సురేశ్ పాల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. సర్కిల్ అధికారి చంద్రకేశ్ సింగ్, ఇతర పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Recommended Video

    Rahul Gandhi పై దాడి ఘటన పై తెలంగాణ కాంగ్రెస్ నేతల నిరసన, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అరెస్ట్

    నిందితుడిని వదిలేయబోమని.. కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో అధికారుల బాధ్యతరాహిత్యం ఉంటే వారిపై చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. కాల్పుల నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసు బలగాలను మొహరించారు. పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+