చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల్లి వివాహేతర సంబంధం: కొడుకు బలైపోయాడు, చెన్నైలో దారుణం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Mother's Paramour Causes Her Son's Lost Life | Oneindia Telugu

చెన్నై: దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల మాయలో కుటుంబ సభ్యులను, కట్టుకున్నవాళ్లను కడతేర్చడానికి కూడా వెనుకాడట్లేదు. తాజాగా చెన్నైలోనూ ఓ వివాహేతర సంబంధం ఇలాంటి హత్యకే దారితీసింది.

ఇలా వెలుగులోకి..

ఇలా వెలుగులోకి..

చెన్నైలోని తాంబరం సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంటులో బుధవారం ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఓ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో గురువారం పోలీసులు బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడి తల్లిదండ్రుల అనుమానం మేరకు నాగరాజు(27) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా అసలు నిజాలు వెలుగుచూశాయి.

బాలుడు రితేష్ సాయిగా గుర్తింపు..:

బాలుడు రితేష్ సాయిగా గుర్తింపు..:

హత్యకు గురైన బాలుడి పేరు రితేష్ సాయి అని పోలీసులు తెలిపారు. రితేష్ నేసపాక్కంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నట్టు చెప్పారు. హంతకుడు నాగరాజుకు బాలుడి తల్లి మంజులతో వివాహేతర సంబంధం ఉందని తెలిపారు. మంజుల ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగస్తురాలని వెల్లడించారు.

తండ్రి ఫిర్యాదుతో..:

తండ్రి ఫిర్యాదుతో..:

మంజుల భర్త కార్తీకేయన్ ఇంటీరియర్ డిజైన్ సంస్థను నడుపుతున్నారని పోలీసులు వెల్లడించారు. రోజూ లాగే కుమారున్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేందుకు బుధవారం సాయంత్రం కార్తీకేయన్ అక్కడికి వెళ్లారని, కానీ అప్పటికే మరో వ్యక్తి బాలుడిని తీసుకెళ్లినట్టుగా ఆయనకు తెలిసిందని అన్నారు.దీంతో ఎంజీఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కార్తీకేయన్ బాలుడి మిస్సింగ్ పై ఫిర్యాదు చేశారని చెప్పారు.

వివాహేతర సంబంధం..:

వివాహేతర సంబంధం..:


విచారణ చేపట్టిన పోలీసులకు.. కార్తీకేయన్‌కు నాగరాజు అనే వ్యక్తితో గతంలో గొడవ జరిగినట్టు గుర్తించారు. తన భార్య మంజులతో నాగరాజుకు సంబంధం ఉందని అనుమానించిన కార్తీకేయన్.. కొన్ని నెలల క్రితం అతనితో గొడవపడ్డట్టు గుర్తించారు.

అంతేకాదు, తన భార్యతో సంబంధాన్ని అడ్డుపెట్టుకుని నాగరాజు తన ఆస్తిని కాజేసే కుట్ర చేసినట్టు కార్తీకేయన్ పసిగట్టినట్టు తెలిపారు.

నిందితుడి అరెస్ట్:

నిందితుడి అరెస్ట్:

పరారీలో ఉన్న నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.. వుక్రవారం ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తిరువాన్నమలై ప్రాంతంలో అతన్ని అరెస్ట్ చేశారు.

సెలయూర్ లోని ఐఏఎఫ్ రోడ్డు సమీపంలో ఉన్న ఒక అపార్ట్ మెంటులో బాలుడిని చంపేసినట్టు నాగరాజు ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని తీసుకుని అక్కడికి వెళ్లగా బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

గొంతు కోసి హత్య..:

గొంతు కోసి హత్య..:

మార్కెటింగ్ మేనేజర్ అయిన నాగరాజు.. ఇంకా కన్‌స్ట్రక్షన్ లోనే ఉన్న కొన్ని అపార్ట్‌మెంట్లకు ఇన్‌చార్జీగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలుడిని నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్ మెంటులోకి తీసుకెళ్లి హత్య చేశాడు. మొదట బాలుడి గొంతు కోసి, ఆపై ఇనుపరాడ్డుతో అతన్ని హతమార్చాడు. ప్రస్తుతం నిందితుడు కస్టడీలో ఉన్నాడు. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

English summary
In a cruel incident, a 10-year-old boy was kidnapped and beaten by an iron rod till death by his mother's paramour in the city. Rithesh Sai with his parents Karthikeyan and Manjula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X