ఢిల్లీ అసెంబ్లీలో ఓటేసిన శతాధిక వృద్ధురాలు, పుష్పగుచ్చం అందజేసిన అధికారులు
ఢిల్లీలో ఓటేసేందుకు యువకులే కాదు వృద్ధులు కూడా ఆసక్తి కనబరిచారు. 111 ఏళ్ల బామ్మ కాళితార మండల్ మండల్ అనే శతాధిక వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. సీఆర్ పార్క్ సెంటర్లో బామ్మ ఓటేశారు. వీల్ చైయిర్లో వచ్చిన ఆమె.. తన ఓటు హక్కు వినియోగించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఓటేసేందుకు శతాధిక వృద్ధురాలు ముందుకురావడాన్ని అధికారులు స్వాగతించారు. ఆమెకు పుష్పగుచ్చం అందజేశారు.

ఆనందంలో బామ్మ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పేరు వచ్చినప్పటీ నుంచి బామ్మ ఆనందానికి అవధి లేకుండాపోయింది. ఎప్పుడెప్పుడూ ఓటు వేద్దామని అనుకొన్నారు. గత కొన్నిరోజుల నుంచి ఎదురుచూస్తున్న బామ్మకు సమయం రానే వచ్చింది. శనివారం ఉదయం సీఆర్ పార్క్ సెంటర్ పోలింగ్ బూత్లో బామ్మ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

చేపలు ఇష్టమట..
ఓటు తనకు శక్తిని ఇస్తుందని బామ్మ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరింది. బామ్మకు దంతాలన్నీ ఊడిపోయాయి. కానీ ఆమెకు చేపలు అంటే ఇష్టమని పేర్కొన్నారు. ఢిల్లీలోని బెంగాలీ వాడలో బామ్మ ఉంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లోనూ బామ్మ ఓటేశారు. 2020లో కూడా వజ్రాయుధాన్ని యూజ్ చేశారు.

తొలిసారి ఓటు..
మరోవైపు ప్రియాంక వాద్రా కుమారుడు రైహన్ రాజీవ్ వాద్రా, కేజ్రీవాల్ కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిద్దరు తొలిసారి ఓటు వేశారు. వీరేకాక తొలిసారి వచ్చిన యువకులు చాలా మంది ఓటువేశారు. యువకులు, పెద్దలతోపాటు వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి కనబరచడం శుభపరిణామమని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications