యూపీలో కుప్పకూలిన ఫ్లైఓవర్: 12 మంది మృతి, పలువురికి గాయాలు
వారణాసి: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ ఫ్లైఓవర్ కుప్పకూలిన ఘటనలో సుమారు 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది.
వారణాసిలోని నిర్మాణంలో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఫ్లైఓవర్ కుప్పకూలింది. దీంతో 12 మంది మృత్యువాతపడ్డారు. పలు కార్లు ఫ్లైఓవర్ పలువురు కూలీలు చిక్కుకొన్నారు. కొన్ని కార్లు, ఇతర వాహనాలు కూడ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటన తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు, మంత్రి నీలకాంత్ తివారీని వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.
సహయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం యోగీ ఆదిత్యనాధ్ అధికారులను ఆదేశించారు.ఇదిలా ఉంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫ్లైఓవర్ కింద చిక్కుకొన్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.