ఇండియాలో ఉండలేం బాబోయ్..! 12 ఏళ్లలో 17 లక్షల మంది జంప్-2022లో అత్యధికం..
భారత్ లో మారుతున్న పరిస్ధితులు ఇక్కడి పౌరుల్ని స్ధిమితంగా ఉండనీయడం లేదా ? మన దేశంలో కంటే విదేశాల్లోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సురక్షితంగా ఉంటామని భావిస్తున్నారా ? జీవన స్ధాయిలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో విదేశాలకు మన పౌరులు తరలిపోతున్నారా ? ఇవన్నీ నిజమే అని తాజాగా బయటపడుతున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని కేంద్రం కూడా పార్లమెంటులో గణాంకాలతో సహా తేల్చిచెప్పేసింది.
గత 12 ఏళ్లలో దాదాపు 17 లక్షల మంది భారతీయులు దేశం వదిలి వెళ్లిపోయారు. వివిధ కారణాలతో వీరంతా ఈ పుష్కర కాలంలో భారతీయ పౌరసత్వం తమకు వద్దనుకుని విదేశాలకు వెళ్లిపోయారు. వీరిలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వాళ్లు, ఉద్యోగాల వేటలో వెళ్లిన వాళ్లు, విదేశాల్లో అప్పటికే స్ధిరపడిన తమ వాళ్ల వద్దకు వెళ్లిన వాళ్లు, విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించి అక్కడికి వెళ్లిపోయిన వాళ్లు, విదేశాల్లో జీవన స్ధాయిలు ఎక్కువగా ఉండటం వల్ల వెళ్లిన వాళ్లు, దేశంలో పరిస్ధితులు నచ్చక వెళ్లిపోయిన వాళ్లు ఇలా పలు కేటగిరీల వాళ్లు ఇందులో ఉన్నారు.

గత పుష్కర కాలంలో దేశం నుంచి 16.63 లక్షల మంది తమ పౌరసత్వం వదులుకుని విదేశాలకు వెళ్లిపోయినట్లు కేంద్రమంత్రి మురళీధరన్ తాజాగా పార్లమెంటులో వెల్లడించారు. 2014 నుంచి 2022 మధ్య 12.88 లక్షల మంది భారత్ వదిలి వెళ్లిపోయినట్లు ఆయన తెలిపారు. 2022లో ఇలా వలస వెళ్లిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2022లో అత్యధికంగా 2.25 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకుని వెళ్లిపోయారు. అలాగే 2014-2022 మధ్య 2.64 లక్షల మంది తమ పాస్ పోర్టులు అప్పగించేశారని తేలింది.
2014 నుంచి 2022 వరకూ అంటే మోడీ సర్కార్ అధికారంలో ఉన్న ఈ ఎనిమిదేళ్లలో 2.64 లక్షల మంది పాస్ పోర్టులు అప్పగించేయగా.. ఇందులో అత్యధికంగా ఢిల్లీ ప్రజలు 60 వేల మంది, పంజాబ్ వారు 28 వేల మంది, గుజరాత్ వారు 22 వేల మంది, గోవా నుంచి 16 వేల మంది ఉన్నారు. అలాగే ఏపీకి చెందిన 9 వేల మంది, తెలంగాణకు చెందిన 7 వేల మంది కూడా ఇలా విదేశాలకు వలస వెళ్లిపోతూ పాస్ పోర్టుకు సరెండర్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications