బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లో ఎస్కలేటర్ నుంచి జారి చిన్నారి మృతి, అధికారులు!
బెంగళూరు: బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లోని ఎస్కలేటర్ నుంచి కింద జారిపడిన చిన్నారి మరణించింది. తీవ్రగాయాలైన హరిణి అలియాస్ హాసిని (18 నెలలు ) చికిత్స విఫలమై మరణించిందని సోమవారం బెంగళూరులోని సుబ్రమణ్య నగర పోలీసులు తెలిపారు.
ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో హాసిని అనే చిన్నారి తల్లి, అవ్వతో కలిసి శ్రీరాంపుర మెట్రో రైల్వేస్టేషన్ చేరుకుంది. తరువాత ముగ్గురూ ఎక్సలేటర్ మీద వెలుతున్న సమయంలో చిన్నారి హాసిని జారి కింద పడిపోయింది. ఎక్సలేటర్ నుంచి చిన్నారి కిందకు జారి నేల మీద పడిపోయింది.
విషయం గుర్తించి మెట్రో రైల్వే సిబ్బంది వెంటనే ఎక్సలేటర్ నిలిపివేశారు. హాసినిని వెంటనే ఇందిరాగాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై చిన్నారి హాసిని మరణించిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల నిర్లక్షం వలనే చిన్నారి హాసిని మరణించిందని అధికారులు ఆరోపిస్తున్నారు.
మెట్రో రైల్వేస్టేషన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికులకు పలు జాగ్రత్తలు సూచించాలని, ఇప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని ప్రజలు అంటున్నారు. ఇటీవల నేషనల్ కాలేజ్ మెట్రో రైల్వేస్టేషన్ పట్టాల మీద పడిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు, ఈ సంఘటన మరువక ముందే చిన్నారి హాసిని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.