కొండచరియలు విరిగిపడి 18 మంది సజీవ సమాధి
డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ లో కొండచరియలు విరిగిపడి 18 మంది సమాధి అయ్యారు. డార్జిలింగ్ జిల్లాలో గత రెండు మూడు రోజుల నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కుర్సేంగ్ సబ్ డివిజన్, కలింపాంగ్ ప్రాంతాలలో మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపోయాయి.
సుమారు 25 వేర్వేరు ప్రాంతాలలో కొండచరియలు విరిగిపోవడంతో 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శిథిలాల కింద నుండి వారి మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. కొండచరియలు తొలగించడానికి అధికారులు నానా తంటాలుపడుతున్నారు.

కొండ చరియలు విరిగిపడటంతో మరొ 15 మంది గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు. వారి కోసం వివిధ ప్రాంతాలలో గాలిస్తున్నారు. డార్జిలింగ్- సిక్కిం లను కలిపే 10వ నెంబర్ జాతీయ రహదారి మీద కొండ చరియలు విరిగిపడ్డాయి.
మంగళవారం రాత్రి నుండి డార్జిలింగ్- సిక్కిం మార్గంలో వాహన సంచారం పూర్తిగా స్థంభించింది. విషయం తెలుసుకున్న అధికారులు బుధవారం జాతీయ రహదారి దగ్గరకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత చర్యగా కొన్ని ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
-
విస్తరించిన ఉపరితల ఆవర్తనం- ఏపీలో 15 జిల్లాల్లో వర్షాలు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications