Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్ కాల్పులు: దంపతుల మృతి, ముగ్గురు జవాన్లకు గాయాలు

సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది.

శ్రీనగర్‌: సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. గుల్పురా ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద శనివారం ఉదయం నుంచి పాక్‌ రేంజర్లు జరుపుతున్న కాల్పుల్లో భార్యాభర్తలు మృతిచెందారు.

ఈ కాల్పుల్లో వారి చిన్నారులు కూడా గాయపడ్డారు. కాగా, మృతి చెందిన వ్యక్తి భారత జవాను అని ప్రాథమికంగా తెలిసింది. కాల్పుల నేపథ్యంలో భద్రతాసిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎదురుకాల్పులు చేపట్టి పాక్‌ సైన్యానికి ధీటుగా బదులిస్తున్నారు.

 2 civilians killed in Pak firing along LoC

ఇది ఇలా ఉండగా, బాందిపొరా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. హాజిన్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్విహిస్తున్న బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఓ వైపు చైనా-భారత్ సరిహద్దులో చైనా బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా, మరో వైపు పాక్ ఇలా కాల్పులు తెగబడుతుండటం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+