నుహ్లో హింసాత్మక ఘటనలు: ఇద్దరు మృతి, కర్ఫ్యూ విధింపు
ఛండీగఢ్: హర్యానాలోని నుహ్(Nuh)లో స్థానికంగా ఓ మతపరమైన ఊరేగింపుపై కొంతమంది రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. పలు కార్లను తగులబెట్టారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు మరణించారు. కనీసం 15 మంది పోలీసులతో సహా, పలువురు గాయపడ్డారు.
గాయపడిన ఎనిమిది మంది పోలీసు సిబ్బందిని గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. హోంగార్డులలో ఒకరు నీరజ్ తుపాకీ గాయం కారణంగా మరణించారని మరొక పోలీసు అధికారి ధృవీకరించారు. గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు షెల్స్ను ప్రయోగించారు.
గాల్లోకి కాల్పులు జరిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా బలగాలు మోహరించాయి. ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్, మెసేజింగ్ సేవలు నిలిపివేయబడ్డాయి.

అంతకుముందు రోజు, విశ్వ హిందూ పరిషత్ బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్రను నూహ్లోని ఖేడ్లా మోడ్ సమీపంలో కొంతమంది యువకులు అడ్డుకున్నారు. ఆ ఊరేగింపుపై రాళ్లు విసిరినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఊరేగింపులో ఉన్న వ్యక్తులు తమను అడ్డుకున్న యువకులపై రాళ్లు రువ్వారు.
దీనికంతటికి ఓ వీడియో కారణమైనట్లు స్థానిక వార్తాసంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను రప్పించారు.
ఊరేగింపులో భాగమైన కనీసం నాలుగు కార్లకు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. నుహ్, గురుగ్రామ్ జిల్లాల్లో ప్రజలు సమావేశాన్ని నిషేధిస్తూ నిషేధాజ్ఞలు విధించారు. తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతను నియంత్రించడానికి మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను ఆగస్టు 2 (బుధవారం) వరకు నిలిపివేసినట్లు హర్యానా ప్రభుత్వం తెలిపింది.
ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని నూహ్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వార్ తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ విధించాం.. కర్ఫ్యూ ఆదేశాలు ఇచ్చాం.. శాంతిభద్రతలను కాపాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని, జిల్లాలో కర్ఫ్యూ విధించగా పరిస్థితి సాధారణంగానే ఉందని స్పష్టం చేశారు.
आज की घटना दुर्भाग्यपूर्ण है, मैं सभी लोगों से प्रदेश में शांति बनाए रखने की अपील करता हूँ।
— Manohar Lal (@mlkhattar) July 31, 2023
दोषी लोगों को किसी भी कीमत पर बख्शा नहीं जाएगा, उनके खिलाफ सख्त से सख्त कार्रवाई की जाएगी।
శాంతి కోసం విజ్ఞప్తి చేశారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఘర్షణలకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. "నేటి ఘటన దురదృష్టకరం, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని" ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
VIDEO | Several vehicles torched after clashes broke out between two groups in Haryana's Mewat earlier today pic.twitter.com/fSX8bxxwYM
— Press Trust of India (@PTI_News) July 31, 2023
నుహ్లోని శివాలయంలో ఆశ్రయం పొందిన 2,500 మంది పురుషులు, మహిళలు, పిల్లలను పోలీసులు ఖాళీ చేయించినట్లు హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఘటనా స్థలంలో తగిన బలగాలను మోహరిస్తున్నట్లు హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. మేవాత్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరినీ కాపాడుతున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్ జిల్లాలోని సోహ్నాలో కూడా హింస చెలరేగడంతో, 15 కంపెనీల అదనపు కేంద్ర బలగాలను హర్యానాకు పంపుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications