కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ట్రక్కులకు నిప్పు, ఇద్దరు వ్యాపారుల మృతి
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వాహనాల లక్ష్యంగా దాడులు చేశారు. సోపియాన్ జిల్లా చిత్రగాం వద్ద ఆగి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో కశ్మీరేతరులు ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వాహనాలకు నిప్పుపెట్టడంతో కలకలం రేగింది. వెంటనే పోలీసులు ప్రమాద స్థలంలో కూంబింగ్ చేపట్టారు.
గురువారం సాయంత్రం 6.45 గంటలకు ఘనట జరిగింది. జైనపోర పోలీసు స్టేషన్ పరిధిలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. ఇటీవలే ఆపిల్ రైతులు, వ్యాపారులకు భద్రత కల్పిస్తామని పోలీసులు భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉగ్ర మూకలు రెచ్చిపోవడం కలకలం రేగింది. మృతుల్లో ఒకరు జీవన్ సింగ్ అని గుర్తించారు. అతని స్వస్థలం పంజాబ్లోని హోషియాపూర్ అని గుర్తించారు. అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.

మరొకరు రాజస్థాన్కు చెందిన మహ్మద్ ఇలియాన్గా గుర్తించారు. అతని స్వస్థలం అల్వార్ అని పోలీసు అధికారులు వివరించారు. గత కొన్నాళ్ల నుంచి యాపిల్ వ్యాపారుల లక్ష్యంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దీంతో కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్తబ్ధుగా ఉన్న కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగస్ట్ 5వ తేదీన కశ్మీర్ను జమ్ముకశ్మీర్, లడాఖ్గా విభజించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కశ్మీర్ లోయ గుంభనంగా ఉండిపోయింది. సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా మొహరించారు. కానీ ఆడపాదడపా మాత్రం దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications