ఎన్కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం, ఇద్దరు పోలీసుల మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా జిల్లా ఆరంపొరాలో గస్తీ నిర్వర్తిస్తున్న సైనికులపై ముష్కరులు దాడికి తెగబడ్డారు.
సమచారం అందుకున్న అధికారులు అదనపు బలగాలను మోహరించారు. మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.

మంగళవారం రాత్రి వరకు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో నలుగురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా సిబ్బంది వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరింత మంది ముష్కరులు ఉండొచ్చనే అనుమానంతో గాలింపు చేపట్టారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. మంగళవారం నుంచి ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా దళాలు బుధవారం తెలిపాయి. బుధవారం మరోసారి ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారని తెలిపారు. భద్రతా దళాలు ఉగ్రవాదులను దాడులను తిప్పికొడుతున్నాయని చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications