మిస్టీరియస్ డెత్.. ఎన్నో అనుమానాలు
Crime: కర్ణాటకకు చెందిన యువతి ఒకరు పంజాబ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. స్నేహితులను విచారించారు.
ఆ యువతి పేరు ఆకాంక్ష. వయస్సు 22 సంవత్సరాలు. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా బేళ్తంగడి తాలూకా బొలియూరు ఆమె స్వగ్రామం. పంజాబ్ లోని ఫగ్వారాలో గల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ చదివారు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తోన్నారు. అక్కడే నివాసం ఉంటోన్నారు.

జర్మనీలో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ లో ఉన్నత స్థాయి శిక్షణ పొందడానికి కొద్దిరోజుల కిందట ప్రయత్నాలు చేపట్టారు. దీనికి అవసరమైన కొన్ని సర్టిఫికెట్ల కోసం యూనివర్శిటీని సంప్రదించారు. సర్టిఫికెట్ల కోసం వ్యక్తిగతంగా రావాలంటూ సిబ్బంది సూచించడంతో ఆమె ఫగ్వారా వెళ్లారు.
ఆకాంక్ష పంజాబ్లోని పఘ్వారాలోని ఎల్సియు కళాశాలలో ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, తదుపరి శిక్షణ కోసం జర్మనీకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. అందువల్ల, ఆమె విద్యా పత్రాలు అవసరమైనందున, ఆమె చదువుకున్న పఘ్వారా ఎల్సియు కళాశాలను సంప్రదించి సర్టిఫికెట్లు అడిగింది. కానీ కళాశాల సిబ్బంది సర్టిఫికెట్ పంపలేమని, ఆమె స్వయంగా వచ్చి తీసుకోవాలని చెప్పారు. అందుకే, ఆమె పంజాబ్లోని కళాశాలకు బయలుదేరింది.
తమ కుమార్తె కాలేజీకి చేరుకునేంత వరకు టచ్ లో ఉన్నారని, ఆ తరువాత ఆమెకు ఏం జరిగిందనేది తెలియరావట్లేదని ఆకాంక్ష తల్లిదండ్రులు సురేంద్ర, సింధుదేవి తెలిపారు. దానిపై వాళ్లు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఆమె మరణం చుట్టూ ఉన్న పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ కేసులో కళాశాల అధికారుల ప్రమేయం ఉండవచ్చని ఆరోపిస్తున్నారు.
బలవన్మరణానికి పాల్పడేంత కారణాలు ఆకాంక్షకు ఏమీ లేవని, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నామని సురేంద్ర చెప్పారు. ఏరో స్పేస్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తోందని, ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లడానికీ సిద్ధం అయిందని గుర్తు చేశారు. జర్మనీలో అవకాశం రావడం పట్ల ఆమె సంతోషంగా ఉందని అన్నారు. దీనిపైసమగ్ర దర్యాప్తు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications