వరద విలయం: ఈశాన్యంలో పోటెత్తిన వరదలు...23 మంది మృతి
ఈశాన్య భారతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా అస్సాంలో పోటెత్తిన వరదలకు ఆరు మంది మృతి చెందారు. దీంతో అక్కడ సంభవించిన వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరింది. ఆదివారం రోజునాటికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
అస్సాంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అతలా కుతలమైంది. జనజీవనం స్థంభించిపోయింది. అక్కడ కురుస్తున్న వర్షాలకు స్థానిక నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మొత్తం 4లక్షల 50వేల మంది ప్రజలు వరద బారిన పడ్డారు. మూడుజిల్లాల్లో 5 మంది మృతి చెందినట్లు సమాచారం. అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం ఒక్క కరీంగంజ్ ప్రాంతంలోనే 2లక్షల మంది వరదలతో తీవ్రంగా నష్టపోయారు.

ప్రస్తుతం జోర్హత్లోని నిమాటి ఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. మణిపూర్లో కూడా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని అక్కడ ప్రజలు అప్రమత్తతతో ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు నివేదికను పంపుతున్నారు. గతం వారం రోజులుగా కురిసిన వర్షాలకు సర్వం కోల్పోయిన వారికోసం తక్షణమే నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని బీరేన్ సింగ్ రాజ్నాథ్ను కోరారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ?












Click it and Unblock the Notifications