పశ్చిమ ఢిల్లీ అల్లర్లపై జోరుగా పుకార్లు, 24 ఏళ్ల యువకుడి సోషల్ మీడియా ఖాతా, అరెస్ట్
ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాలతో అట్టుడికిపోతోంది. పశ్చిమ ఢిల్లీలో హింసను ప్రేరేపించేందుకు ఓ యువకుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేశాడు. అతన్ని ఢిల్లీ సైబర్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతనికి సోషల్ మీడియాలో 10 వేల మంది ఫాలోవర్లు ఉన్నారని పోలీసులు గుర్తించారు.

పశ్చిమ ఢిల్లీలో గల నిహల్ విహర్కు చెందిప అభిషేక్ (24) సోషల్ మీడియాలో అల్లర్లను ప్రేరేపించే పోస్టులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతని మొబైల్ స్వాధీనం చేసుకొని, పరిశీలించి చూడగా.. అతని ప్రొఫైల్ నుంచి పోస్టు పెట్టినట్టు గుర్తించారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు వివరించారు.
Recommended Video

పశ్చిమ ఢిల్లీలో ఆదివారం సోషల్ మీడియా ద్వారా పోస్టులు రావడంతో.. దీంతో భయానక వాతావరణం నెలకొంది. కొందరు చట్ట వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తాము అదుపులోకి తీసుకున్న 40 మందికి అల్లర్లతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications