Omicron కేసుల టెన్షన్.. ఇవాళ మరో 3, ఇరవై ఆరుకి చేరిన మొత్తం కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 23 ఉన్న కేసులు ఇవాళ మరో 3 పెరిగాయి. గుజరాత్ జామ్ నగర్లో రెండు, ముంబై ధారావిలో ఒక కేసు వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 11 కేసులు, రాజస్తాన్లో 9, గుజరాత్ 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒక కేసు వచ్చింది. ఇప్పటివరకు వైరస్ సోకిన వారికి స్వల్ప లక్షణాలు బయటపడ్డాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలియజేసింది.

83 మందికి పాజిటివ్.. కానీ
రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన 83 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వీరిలో 13 మందికి ఒమిక్రాన్ వచ్చిందని వివరించారు. ప్రజల ఆరోగ్యంపై ఇప్పటివరకు ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపలేదని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు. వైరస్ తీవ్రతను పరిశీలిస్తున్నామని.. ఆ తర్వాత వ్యాక్సిన్ గురించి స్పష్టత వస్తోందని వివరించారు. ఒమిక్రాన్ వల్ల.. రోజువారీ పరిశీలన ఉంటుందని చెప్పారు. ఇప్పటివరకు అయితే పరిస్థితి అదుపులోనే ఉందని.. 5 శాతం కన్నా వ్యాప్తి ఉంటే జిల్లా స్థాయిలో ఆంక్షలు తప్పవని స్పష్టంచేశారు.

మాస్క్ ధరించలేదు..
దేశంలో ఇప్పటికీ చాలా మంది మాస్క్ ధరించడం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం అని వివరించారు. వ్యాక్సిన్ తీసుకోవడం.. మాస్క్ ధరించడం రెండు ముఖ్యమేనని చెప్పారు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో అయినా మనందరం జాగ్రత్తగా ఉండాలని కోరారు. చిన్నారులకు వ్యాక్సిన్ గురించి ఇప్పటివరకు సమాచారం తెలియరాలేదు. ఇప్పటివరకు దేశంలో 131 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. యువతకు దాదాపుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. నిన్నటి వరకు 74.5 కోట్ల మంది యువతకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. కేరళలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి.

23 + 3
దేశంలో ఒమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు వచ్చాయి. 9 కేసులు రాజస్థాన్లో రాగా.. 7 కేసులు మహారాష్ట్రలోని పుణే జిల్లాలో వచ్చాయి. అంతకుముందు కర్ణాటకలో రెండు, గుజరాత్లో ఒకటి, ఢిల్లీలో ఒక కేసు బయటపడ్డాయి. సోమవారం ముంబైలో మరో ఇద్దరికి నిర్ధారణ కావడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి పెరిగింది. ఇవాళ మరో 3 కేసులు వచ్చాయి. దీంతో 26కి కేసులు చేరాయి.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications