రైలుకు ఎదురెళ్ళి ప్రాణాలతో బయటపడిందిలా....ఎందుకంటే?
మెట్రో రైల్వే స్టేషన్ లోకి వచ్చిన రైలుకు ఎదురు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన ఓ వైద్యురాలు ప్రాణాలతో బతికింది. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
న్యూఢిల్లీ:మెట్రో రైల్వే స్టేషన్ లోకి వచ్చిన రైలుకు ఎదురు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన ఓ వైద్యురాలు ప్రాణాలతో బతికింది. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన గురుగావ్ లోని మెట్రో స్టేషన్ లో చోటుచేసుకొంది.
ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఓ వైద్యురాలు పనిచేస్తోంది.ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు కాని, రైలుకు ఎదురెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే ఈ ప్రమాదంలో ఆమె గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
గురుగ్రామ్ మెట్రో స్టేషన్ లోని ఫ్లాట్ పాం పై ఆమె అటు ఇటూ నడుస్తూ ఉన్న ఆమె రైలు రాగానే ఒక్కసారిగా పట్టాల మీదికి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.సోమవారం ఉదయం సమయంలో గురు ద్రోణాచార్య మెట్రో స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకొంది.

ఈ ఘటనతో పది నిమిషాల పాటు రైలు సర్వీసులకు అంతరాయమేర్పడింది.ఇది ఆత్మహత్యా ప్రయత్నం కాదని రైల్వే అధికారులు చెబుతున్నారు. సీసీ టీవి పుటేజీ చూస్తే మాత్రం సరిగా రైలు వచ్చే సమయానికి పట్టాల మీదికి దూకినట్టుగా కన్పిస్తోంది.
దీంతో ఆమెకు పలు చోట్ల గాయాలయ్యాయి.అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.ఆమె కోలుకొన్న తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకొనే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications