భర్త, పిల్లల కళ్ల ముందే కారులో మహిళ సజీవదహనం, ఆంధ్రాలో బంధువుల కోసం వెలుతుంటే !
బెంగళూరు: వేగంగా వెలుతున్న కారులో ఆకస్మికంగా మంటలు వ్యాపించి కుటుంబ సభ్యుల సమక్షంలో మహిళ సజీవదహనం అయిన ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని నిర్నా క్రాస్ సమీపంలోని జాతీయ రహదారిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంకు చెందిన కల్యాణి (28) అనే మహిళ కారులో సజీవదహనం కావడంతో ఆమె భర్త, ఇద్దరు పిల్లలు చిన్నచిన్న గాయాలతో ప్రాణాలతో భయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లోని మచలీపట్నంకు చెందిన కల్యాణి కుటుంబ సభ్యులు వ్యాపారం నిమిత్తం మహారాష్ట్రలోని నాసిక్ లో స్థిపరడ్డారు. మచిలీపట్నంలోని బంధువులను చూడటానికి కల్యాణి భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో నాసిక్ నుంచి బయలుదేరారు.

మార్గం మధ్యలో గురువారం బీదర్ జిల్లాలోని చిటగుప్పా తాలుకా నిర్నా క్రాస్ సమీపంలోని జాతీయ రహదారిలో వేగంగా వెలుతున్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కల్యాణి మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కల్యాణి కారులో నుంచి బయటకు రాలేకపోయింది.
కల్యాణి భర్త, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. కుటుంబ సభ్యులు చూస్తున్న సమయంలోనే కల్యాణి కారులో సజీవ దహనం అయ్యింది. విషయం గుర్తించిన స్థానికులు కారులో మంటలు అదుపు చేసి పోలీసులకు సమాచారం అందించారు. కల్యాణి భర్త, వారి పిల్లలను ఆసుపత్రికి తరలించారు. కారులో షార్ట్ సర్కూట్ వలనే మంటలు వ్యాపించి ఉంటాయని, కల్యాణి భర్తను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications