స్పైస్జెట్కు ఏమైంది?: ‘క్రాక్స్’తో మరో విమానంలో ముంబైలో ల్యాండ్, 17 రోజుల్లో 6వ ఘటన
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్జెట్కు చెందిన విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతుండటం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఉదయం దిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానాన్ని సాంకేతిక సమస్యలతో అత్యవసరంగా కరాచీలో ల్యాండ్ చేశారు. ఈ ఘటన మరవకముందే మరో విమానాన్ని ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. కాండ్ల నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న విమాన విండ్షీల్డ్ దెబ్బతినడం వల్ల ముంబైలో ల్యాండ్ చేశారు.
ఔటర్ విండ్షీల్డ్ పాన్ మిడ్ఎయిర్లో పగుళ్లు ఏర్పడటంతో స్పైస్జెట్ విమానం మంగళవారం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. "జూలై 5, 2022న, స్పైస్జెట్ Q400 విమానం SG 3324 (కాండ్లా - ముంబై) నడుపుతోంది. FL230 వద్ద క్రూజ్ సమయంలో, P2 సైడ్ విండ్షీల్డ్ ఔటర్ పేన్ పగిలిపోయింది. ఒత్తిడి సాధారణంగా ఉందని గమనించబడింది. దీంతో విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయింది" అని స్పైస్జెట్ ప్రతినిధి తెలిపారు.
అంతకుముందు, ఢిల్లీ నుంచి దుబాయ్కి వెళ్లే మరో స్పైస్జెట్ విమానం సాంకేతిక లోపంతో ఇదే రోజున పాకిస్తాన్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంధన సూచికలో లోపం ఏర్పడిందని, దీంతో కరాచీ వైపు మళ్లించాల్సి వచ్చిందని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తెలిపింది.
ప్రయాణికులందరూ కరాచీలో సురక్షితంగా ఉన్నారని ఎయిర్లైన్ ప్రతినిధి తెలిపారు. గత 17 రోజుల్లో స్పైస్జెట్ విమానం పనిచేయకపోవడం ఇది ఆరో ఘటన. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ కేసులన్నింటిని విచారిస్తోంది.