మళ్లీ రెచ్చిపోయిన పాకిస్తాన్: సామాన్యులే లక్ష్యంగా కాల్పులు, ముగ్గురు పిల్లలు మృతి
సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. సామాన్యులే లక్ష్యంగా పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
శ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. సామాన్యులే లక్ష్యంగా పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
#UPDATE: 10-year-old boy killed, 5 civilians injured during ceasefire violation by Pakistan in Kerni & Digwar sectors of Poonch in J&K.
— ANI (@ANI) October 2, 2017
జమ్ము కాశ్మీర్లోని పూంఛ్ సెక్టారులో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని సోమవారం మరోసారి ఉల్లంఘించింది. ఈ కాల్పుల్లో తొమ్మిదేళ్ల బాలుడు, ఓ బాలికతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
#Visuals Ceasefire violation by Pakistan in Keri and Digwar areas of Poonch district (J&K), three civilians injured. pic.twitter.com/LOPXLVoNOc
— ANI (@ANI) October 2, 2017
పూంచ్ సెక్టార్లో కేరీ, దిగ్వార్లలో పాకిస్తాన్ దళాలు ఉదయం నుంచి భారీగా మోర్టార్ షెల్స్ను ప్రయోగిస్తున్నాయి. దీంతో పూంచ్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.