ఉగ్ర కాల్పులు: ముగ్గురు మృతి, కొనసాగుతున్న ఉగ్రవేట
జమ్మూలోని అక్నుర్ సెక్టార్లోని జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ క్యాంపుపై సోమవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
శ్రీనగర్: మరోసారి ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారు. జమ్మూలోని అక్నుర్ సెక్టార్లోని జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ క్యాంపుపై సోమవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో అక్కడ సివిల్ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
జీఆర్ఈఎఫ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాతృసంస్థ. ఈ సంస్థ సరిహద్దుల్లోని రోడ్లు, భవనాలను నిర్వహిస్తుంటుంది. క్యాంపులోని జూరియన్ ప్రాంతంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రాంతం జమ్మూకు 55 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ సరిహద్దులో ఉంది.

ప్రస్తుతం ప్రాంతాన్ని భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడకు వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధించి ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. ఇటీవల కాలంలో జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడులు పెచ్చరిల్లాయి. నవంబర్ చివరి వారంలో జరిగిన దాడిలో ఇద్దరు మేజర్లతో సహా ఏడుగురు మృతి చెందారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications